Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బిగ్ షాక్
ABN , Publish Date - Jun 05 , 2025 | 08:33 PM
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీస్ కస్టడీకి అప్పగించారు. మూడు రోజులు పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. కాగా, కాకణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమ ఇనుప ఖనిజ గనుల తవ్వకం, భూ కుంభకోణం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

నెల్లూరు: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని (Kakani Govardhan Reddy) పోలీస్ కస్టడీకి అప్పగించారు. మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ నెల్లూరు కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ నెల 6వ తేదీ ఉదయం 10:30 నుంచి 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కస్టడీకి తీసుకోవాలని న్యాయమూర్తి తెలిపారు. కాకాణి తరపు న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని నెల్లూరు కోర్టు జడ్జి సూచించారు.
కాగా, కాకణి గోవర్ధన్రెడ్డిపై అక్రమ ఇనుప ఖనిజ గనుల తవ్వకం, భూ కుంభకోణం వంటి ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఆయనను అరెస్ట్ చేయడానికి పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రయత్నించినప్పటికీ కాకణి దొరకకుండా తప్పించుకోని తిరిగాడు. ఎట్టకేలకు కాకణిని ఏపీ పోలీసులు కేరళలో అరెస్ట్ చేశారు. కాకణిని అరెస్ట్ చేసిన తర్వాత నెల్లూరుకి తీసుకోని వచ్చారు. నెల్లూరులో పోలీసులు పలుమార్లు విచారణ జరిపారు. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారణ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కాకణిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరడంతో కోర్టు ఈ తీర్పు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములవ్వండి.. సీఎం చంద్రబాబు పిలుపు
జగనన్నా.. మాకు దిక్కెవరన్నా.. నెల్లూరులో ఫ్లెక్సీల కలకలం
Read Latest AP News And Telugu News