Share News

Buddha Venkanna: వంశీకి ఏమైనా జరిగితే ప్రభుత్వం పడిపోతుందా..రా చూద్దాం..

ABN , Publish Date - May 25 , 2025 | 12:19 PM

Buddha Venkanna: తెలుగు దేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న.. వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వంగవీటి మోహన రంగా పేద ప్రజల కోసం పాటు పడిన మహనీయుడని, అటువంటి గొప్ప వ్యక్తితో వంశీకి పోలికా.. అంటూ మండిపడ్డారు.

Buddha Venkanna: వంశీకి ఏమైనా జరిగితే ప్రభుత్వం పడిపోతుందా..రా చూద్దాం..
Buddha Venkanna Press Meet

విజయవాడ: వైసీపీ నేత (YCP Leader), మాజీ మంత్రి (Ex Minister Perni Nani) పేర్ని నానిపై టీడీపీ సీనియర్ నేత (TDP Leader) బుద్దా వెంకన్న (Buddha Venkanna) తీవ్ర స్థాయిలో విమర్శలు (Comments) గుప్పించారు. ఈ సందర్బంగా ఆదివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.. వల్లభనేని వంశీ స్వాతంత్య్ర సమరయోధుడు అన్నట్లుగా పేర్ని నానీ తెగ బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు. ‘‘పేర్నీ నానీ నీకు అస్సలు సిగ్గు ఉందా.. నీ బియ్యం కుంభకోణం గురించి చెప్పు.. తప్పుడు పనులు చేసింది కాకుండా.. నీ భార్య పేరు పెడతావా.. చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పిన నువ్వు.. ఇప్పుడు విశ్వాస ఘాతకుడిగా మాట్లాడతావా’’ అంటూ దుయ్యబట్టారు.


ఆ ఘనత వైసీపీదే..

బీసీ నేత కొల్లు రవీంద్రను జైల్లో పెట్టించిన చరిత్ర మీదని, ఆయన హత్యా రాజకీయాలు చేసే వ్యక్తా.. మీకు తెలియదా.. సౌమ్యుడిని 55 రోజుల పాటు జైల్లో పెట్టించారని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్ర మామయ్య నడకుదిటి నరసింహారావు మానసికంగా కుంగిపోయి చనిపోయేలా చేశారని అన్నారు. వంగవీటి మోహన రంగా పేద ప్రజల కోసం పాటు పడిన మహనీయుడని, అటువంటి గొప్ప వ్యక్తితో వంశీకి పోలికా.. పేర్ని నానీ అసలు మీ బుర్ర పని చేస్తుందా అని ప్రశ్నించారు. పేదవాళ్లను అడ్డం పెట్టుకుని డబ్బులు కొట్టేసిన వ్యక్తి వంశీ అని అన్నారు. నానీ మోకాళ్ల మీద కూర్చుని రంగా అభిమానులు, ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ పై కూడా ఇలాగే నోరు పారేసుకున్నారని, ఇఫ్పుడు వంశీ లాంటి నీచుడిని రంగాతో పోలిస్తే.. మీ కులం వాళ్లే నిన్ను చెప్పులతో కొడతారని బుద్ద వెంకన్న అన్నారు.

చంద్రబాబు కుటుంబాన్ని ఎలా తిట్టారో తెలియదా..

బియ్యం కుంభకోణం కేసులో ఇర్కుకోకూడదని.. భార్య పేరు పెట్టి ఆమెను అన్యాయంగా కేసులో పేర్ని నాని ఇరికించారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. వంశీ, కొడాలి నానీలు చంద్రబాబు కుటుంబాన్ని ఎలా తిట్టారో తెలియదా అని నిలదీశారు. వారి బూతుల వల్లే వైసీపీ ఓడిపోయిందని మీ వాళ్లే చెబుతున్నారని.. సిగ్గు లేకుండా ఇంకా ఎలా మాట్లాడుతున్నారని అన్నారు. వంశీ వాంతులు చేసుకున్నారని మాట్లాడిన నానీ.. ఎక్కడ వాంతులు చేసుకున్నారో చూశావా.. అని ప్రశ్నించారు. అవాస్తవాలు ప్రచారం చేసి పబ్బం గడుపుకోవడమే వైసీపీ నాయకుల చరిత్ర అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబు, కొల్లు రవీంద్ర, అచ్చెంనాయుడు, జనార్ధన్ రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. వంశీని అక్రమ అరెస్టు అని ఎవరైనా చెప్పగలా.. వంశీ జైల్లో ఉంటే ఆయన పిల్లలు కూడా వచ్చి చూడటం లేదని, కుటుంబ సభ్యులు కూడా ఛీ కొట్టే నైజం వంశీదని అన్నారు.

Also Read: ప్రజల ఆశీర్వాదంతో జరిగిన ఈ శుభకార్యం ఎప్పటికీ గుర్తుంటుంది..


ఆనాడే చంద్రబాబు ఫ్యాక్షనిజాన్ని ఆపారు..

1995లోనే సీఎంగా చంద్రబాబు రాష్ట్రంలో ఫ్యాక్షనిజాన్ని ఆపారని, వంశీ, కొడాలి నానీల మాటలు, బూతులు చూస్తే.. ఫ్యాక్షనిస్టులు కూడా చీదరించుకుంటారని బుద్దా వెంకన్న అన్నారు. వంశీకి ఏమైనా జరిగితే ప్రభుత్వం పడిపోతుందా.. రా చూద్దాం.. వంశీ అందగాడు అని మీ జగనే చెప్పారు కదా.. మేకప్ వేస్తే ప్రతివాడు అందగాడేనని అన్నారు. జైల్లో ఇవన్నీ కుదరవు కదా.. అసలు రూపం ఇప్పుడు బయట పడిందని, వంశీది వికృత రూపం అని సోషల్ మీడియాలో ప్రజలే పోస్టులు పెడుతున్నారని, మరి ఇలాంటి వ్యక్తి జగన్‌కు ఎలా నచ్చాడో ఆయనకే తెలియాలన్నారు.

పేర్ని నానీ పెద్ద బియ్యం దొంగ..

పేర్ని నానీ ఓ పెద్ద బియ్యం దొంగని.. మిగతా దొంగలను కూడా వెనుకేసుకు వస్తున్నారని బుద్ధా వెంకన్న విమర్శించారు. కొడాలి నానీ ఎక్కడ ఉన్నారు... ఆడు ఈడు అంటూ రంకెలేసిన వ్యక్తి.. ఇప్పుడు పారిపోయారా అని ప్రశ్నించారు. తాము దమ్ముగా, ధైర్యంగా వైసీపీ అరాచకాలను ఎదుర్కున్నామని, కొడాలి నానీ ఇప్పుడు ఎందుకు బయటకు రావటంలేదన్నారు. అరెస్టు అవుతారనే భయం పట్టుకుందా.. కొడాలి నాని అవినీతి దేహం కుళ్లిపోయిందని.. అందుకే ఏపీలో వైద్యం చేయడం కుదరలేదని, అందుకే ముంబై వెళ్లి .. వైద్యం చేయించుకున్నారని ఎద్దేవా చేశారు. పేర్ని నానీకు దమ్ము, ధైర్యం ఉంటే బియ్యం స్కాంపై చర్చకు రావాలంటూ.. ఎప్పుడైనా.. ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ బుద్ధా వెంకన్న సవాల్ చేశారు.


వంశీకి ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి..

వల్లభనేని వంశీకి ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలి.. ఎక్కడ భూములు కొన్నారు.. ఎక్కడ అమ్మారో నిరూపించాలని బుద్దా వెంకన్న అన్నారు. వంశీ ఇళ్ల పట్టాల కోసం పేద ప్రజల దగ్గర డబ్బులు దోచుకున్నారని, అవినీతి పరుడైన వంశీని.. ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన రంగాతో పోల్చడానికి మీకు (పేర్ని నానీ) సిగ్గు లేదా అని ప్రశ్నించారు. రంగాని చంపిన వారు వైసీపీలో పార్టీలో ఎంతమంది ఉన్నారో మీకు తెలియదా అని బుద్ధా వెంకన్న అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..ః

సీఎం చంద్రబాబు కుటుంబం నూతన గృహప్రవేశం

పండుగలా సీఎం చంద్రబాబు గృహప్రవేశం

For More AP News and Telugu News

Updated Date - May 25 , 2025 | 12:25 PM