TDP Mahanadu 2025: పారపట్టి మట్టి పనులు చేసిన మంత్రి

ABN , First Publish Date - 2025-05-26T12:05:47+05:30 IST

TDP Mahanadu 2025: టీడీపీ మహానాడు వేడుక ఈనెల 27న ప్రారంభంకానుంది. దీంతో మంత్రులు, టీడీపీ నేతలు కడపకు పయనమవుతున్నారు. మూడు రోజుల పాటు మహానాడు వేడుక జరుగనుంది.

TDP Mahanadu 2025: పారపట్టి మట్టి పనులు చేసిన మంత్రి
TDP Mahanadu 2025

అమరావతి, మే 26: కడప జిల్లాలో తెలుగు దేశం పార్టీ మహానాడుకు (TDP Mahanadu) సర్వం సిద్ధమైంది. రేపటి (మంగళవారం) నుంచి జరగబోయే టీడీపీ మహానాడుకు మంత్రులు కడపకు బయలుదేరి వెళ్తున్నారు. ఇప్పటికే చేరుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) మహానాడు ప్రాంగణం వద్ద స్వయంగా పనులు చేపట్టారు. పార పట్టుకుని మట్టి పనులు చేసిన మంత్రి.. తాను ఒక కార్యకర్తనే అనే విషయానే చెప్పకనే చెప్పారు. వర్షం వల్ల మహానాడు ప్రాంగణంలోకి నీళ్లు చేరాయి. మహానాడు సభా ప్రాంగణ కమిటీ కన్వీర్‌గా ఉన్న మంత్రి నిమ్మల.. ఈ విషయాన్ని గమనించి స్వయంగా పార పట్టి సభా ప్రాంగణంలో మట్టిని చదును చేశారు. మరోవైపు మంత్రి (Minister Savitha) సవిత కూడా సైకిల్‌‌పై మహానాడుకు బయలుదేరారు. పార్టీ కార్యకర్తలతో కలిసి సైకిల్ తొక్కుతూ బయలుదేరారు మంత్రి.


44 మంది తెలుగు దేశం కార్యకర్తలతో పెనుకొండ నుంచి కడపకు సైకిల్‌పై ర్యాలీగా పయనమయ్యారు. సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలో మంత్రి సవిత ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర చేపట్టారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద పచ్చ జెండా ఊపి మంత్రి సవిత సైకిల్ యాత్రను ప్రారంభించారు. అనంతరం వైజంక్షన్ వరకు దాదాపు రెండు కిలో మీటర్ల మేర మంత్రి సైకిల్ తొక్కారు. మరోవైపు కడప జిల్లాలో మహానాడు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈరోజు మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) మహానాడు వద్దకు రానున్నారు. అంతేకాకుండా ఇప్పటికే మంత్రులు, టీడీపీ నేతలు కడపకు చేరుకున్నారు. రేపు కడప మహానాడుకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu) వెళ్లనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల మహానాడు జరుగనుంది. ఇందు కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. కడప జిల్లాలో తొలిసారి జరుగుతున్న మహానాడు కోసం నగరంలో భారీగా స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం ప్రతినిధుల నమోదుతో మహానాడు మొదలుకానుంది.


తొలిరోజు 27న పార్టీ ప్రతినిధుల సభ, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణతో పాటు టీడీపీ మౌలిక సిద్ధాంతాలు, మంత్రి లోకేశ్‌ ప్రతిపాదించిన 6 సూత్రాల ఆవిష్కరణ, పార్టీ నియామవళిలో సవరణలపై ప్రధాన చర్చ జరగనుంది. ఆరు సూత్రాల్లో మొదటి రెండు సూత్రాలపై మొదటిరోజు చర్చ జరుగనుంది. అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. అలాగే రెండో రోజు ప్రతినిధుల సభతో పాటు పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించనున్నారు. ఆరు సూత్రాల్లో మిగిలిన నాలుగు సూత్రాలపై చర్చించి, తీర్మానాలు చేయనున్నారు. అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ప్రమాణ స్వీకారం తరువాత.. అధ్యక్షుడు ప్రసంగించనున్నారు. ఇక చివరి రోజు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు దాదాపు 5 లక్షల మంది రానున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి

మళ్లీ అనారోగ్యం.. జీజీహెచ్‌కు వల్లభనేని వంశీ

అతడికి ఏదో అయ్యింది.. పిచ్చివాడిగా మారాడు..

Read Latest AP News And Telugu News

Updated Date - 2025-05-26T17:41:46+05:30 IST