Share News

Gottipati Ravikumar: అందుకే యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్‌తో ఒప్పందం.. తేల్చేసిన మంత్రి

ABN , Publish Date - May 08 , 2025 | 10:26 AM

Gottipati Ravikumar: అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసుకున్న మీడియా ద్వారా అసత్యాలు ప్రచారమే జగన్ అజెండాగా పెట్టుకున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. జగన్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలెవ్వరూ విశ్వసించరన్నారు.

Gottipati Ravikumar:  అందుకే యాక్సిస్  బ్రూక్ ఫీల్డ్‌తో ఒప్పందం.. తేల్చేసిన మంత్రి
Minister Gottipati Ravikumar

అమరావతి, మే 8: ఆపరేషన్ సిందూర్‌కు (Operation Sindoor) ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Minister Gottipati Ravikumar) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అమరావతి పర్యటనకు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), మంత్రి లోకేష్‌లు (Minister lokesh) ఉగ్రవాదంపై చర్యలకు ప్రకటించిన మద్దతును రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారన్నారు. దేశం భద్రత కోసం ప్రజలంతా ఒకటవుతుంటే, రాష్ట్రం బాగు కోసం జగన్‌కు మాత్రం మనసు రావట్లేదని విమర్శించారు.


అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసుకున్న మీడియా ద్వారా అసత్యాలు ప్రచారమే జగన్ అజెండాగా పెట్టుకున్నారని మండిపడ్డారు. జగన్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలెవ్వరూ విశ్వసించరన్నారు. యాక్సిన్ రెన్యుబవుల్ ఎనర్జీ-బ్రూక్ ఫీల్డ్‌తో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం రైతులకు, నిరుద్యోగ యువతకూ మేలు చేస్తుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పీక్ అవర్స్‌లో విద్యుత్‌ను సగటున రూ.9.38 కు కొనుగోలు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ద్వారా పీక్ అవర్స్‌లో కూడా రూ.4.60 కే విద్యుత్ దొరుకుతోందని తెలిపారు. జగన్ 2022లో రూ.5.12కు చేసుకున్న యూనిట్ విద్యుత్‌ను తాము రూ.4.60కు తగ్గించి ఒప్పందం చేశామని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో సెకీ నుంచి రూ.2.49కు విద్యుత్ కొనుగోలు చేసామనేది పచ్చి అబద్ధమన్నారు.

Pakistan: లాహోర్‌లో పేలుళ్లు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..


ట్రాన్స్‌మిషన్ లాసెస్, ఇతర ఖర్చులన్నీ కలిపి రూ.5పైనే విద్యుత్ కొనుగోలు వైసీపీ హయాంలో జరిగిందని వెల్లడించారు. రాష్ట్ర భూభాగంలో ఏర్పాటు చేసే యాక్సిన్-బ్రూక్ ఫీల్డ్ ద్వారా రైతుల నుంచి దాదాపు 1700 ఎకరాలు లీజు తీసుకుంటుందన్నారు. ఎకరాకు రూ.31 వేలు రైతులకు లీజ్ చెల్లిస్తూ ప్రతీ 2 ఏళ్లకు 5 శాతం ఈ మొత్తం పెంచేలా ఒప్పందం ఉందని తెలిపారు. రాష్ట్రానికి 9 శాతం జీఎస్టీ రూపంలో ఆదాయం రావటంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్ర భూభాగంలో ఏర్పాటు చేసే సంస్థ నుంచే విద్యుత్ కొనుగోలు చేయటం వల్ల ప్రభుత్వ నియంత్రణలోనే అన్నీ ఉంటాయని అన్నారు. గత ఐదేళ్లు రూ.1.25 లక్షల కోట్లు అప్పులు చేసి విద్యుత్ వ్యవస్థను జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. గత పాలకులు పెంచిన విద్యుత్ చార్జీలు ఇప్పటికీ ప్రజలు చెల్లించాల్సి వస్తోందన్నారు. రానున్న రోజుల్లో అవసరమైతే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామన్న చంద్రబాబు ఆలోచనల్లో భాగంగానే యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్‌తో ఒప్పందం చేసుకున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. వైరల్‌గా మాజీ ఆర్మీ చీఫ్ పోస్ట్

Donald Trump: ఆపరేషన్ సిందూర్‌పై డొనాల్డ్ ట్రంప్ స్పందన

Read latest AP News And Telugu News

Updated Date - May 08 , 2025 | 11:20 AM