Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంతో షాక్కు గురయ్యా.. చంద్రబాబు ట్వీట్
ABN , Publish Date - Jun 12 , 2025 | 04:11 PM
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ స్పందించారు. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.

అమరావతి , జూన్ 12: అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై (Ahmedabad Plane Crash) సామాజిక మాధ్యమం ఎక్స్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) స్పందించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అహ్మదాబాద్లో జరిగిన విమానం ప్రమాదంతో షాక్కు గురైనట్లు సీఎం తెలిపారు. చనిపోయిన ప్రయాణికుల కుటుంబాలకు, సిబ్బంది కుటుంబాలకు, స్థానిక ప్రజల్లో చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
దిగ్భ్రాంతికి గురయ్యా: మంత్రి లోకేష్
విమాన ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా లండన్కు చెందిన బోయింగ్ డ్రీమ్ లైనర్ విషాదకరమైన ప్రమాదంతో దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. ఈ ఘటనపై మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 242 మందితో ప్రయాణిస్తున్న విమానం మేఘని నగర్ సమీపంలో బయలుదేరిన కొద్ది నిమిషాలకే కూలిపోయిందని తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేశారు. ఈ వినాశకరమైన సంఘటనలో మరణించిన వారి ఆత్మ శాంతి కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. త్వరితగతిన రక్షణ, ఉపశమనం, కారణంపై సమగ్ర దర్యాప్తును చేపట్టాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని కేంద్రానికి మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
కాగా.. అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అహ్మాదాబాద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న AI171 ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే షాహీబాగ్ హోటల్ సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 230 మంది ప్రయాణికులు ఉండగా.. 12 మంది సిబ్బంది ఉన్నారు. విమానం కూలిన వెంటనే భారీగా మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
పరీక్షలు మొదలయ్యాయి ఆపలేం.. డీఎస్సీపై సుప్రీం
ఏపీ రైతులకు కేంద్రం శుభవార్త..
Read latest AP News And Telugu News