Home » Minister Nara Lokesh
బీఆర్ఎస్ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని.. గులాబీ నేతలు పబ్లిసిటీ కోసం మాత్రమే తమ ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. బీఆర్ఎస్ గాలి మాటలు తప్ప వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు.
విశాఖపట్నంలో డేటా సిటీకి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ పూర్తిచేశామని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా గూగుల్ డేటా సెంటర్ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ సూచించారు.
ఏపీకి పెట్టుబడులపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సింగపూర్లో పారిశ్రామిక వేత్తలతో వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. వరుస భేటీలతో మంత్రి లోకేష్ మంగళవారం బిజీ బిజీగా ఉన్నారు. క్యారియర్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణ్ భాటియాతో మంత్రి నారా లోకేష్ సింగపూర్లోని షాంగ్రీలా హోటల్లో సమావేశం అయ్యారు.
ఏపీ రాజధాని అమరావతి అనేది కొత్త ఆలోచనలతో, అధునిక వసతులతో నిర్మాణం అవుతున్న కొత్తనగరమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. కొత్త నగరం నిర్మాణం అనేది మంచి అవకాశమని, ఉత్తమ విధానాలు, అనుభవాలను ఉపయోగించి కొత్త నగరాన్ని నిర్మిస్తున్నామని వివరించారు. సింగపూర్ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఇచ్చిందనీ.. నిర్మాణంలో వరల్డ్ బ్యాంక్ కూడా భాగస్వామి అవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు సీఎంవో కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. శనివారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లనున్నారు. 27వ తేదీ ఉదయం 6 గంటలకు సింగపూర్ ఎయిర్పోర్టుకు సీఎం చంద్రబాబు బృందం చేరుకోనున్నారు.
క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో గేమ్ చేంజర్ అవుతుందని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. ఎవ్వరూ క్వాంటమ్ గురించి మాట్లాడనప్పుడు తాము క్వాంటమ్ కంప్యూటింగ్ యూస్ కేసుల గురించి మాట్లాడుతున్నామని తెలిపారు. ఏపీ ఇప్పుడు ఏఐని అడాప్ట్ చేసుకుని హ్యాకథాన్లు నిర్వహిస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
Lokesh Helps Family: రాయలసీమలో ఫ్యాక్షన్ బారిన పడి నష్టపోయిన కుటుంబాలను ఉండవల్లి నివాసానికి పిలుపించుకుని మాట్లాడారు మంత్రి. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
CM Chandrababu Congrats Ashok Gajapathi: మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్గా నియమితులైనందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అభినందనలు తెలియజేశారు. గోవా గవర్నర్గా ఆ పదవికి వన్నె తేవాలని ఆకాంక్షించారు.
మంగళగిరి అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. నియోజకవర్గాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. మంగళగిరిలో రోడ్లపై ఎక్కడ గుంతలు లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు అధికారులకు మంత్రి నారా లోకేష్ వందరోజుల కార్యాచరణ రూపొదించారు.
Minister Lokesh Mega PTM: స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చాక చదువుపై పేరెంట్స్ బాధ్యతగా ఉండాలని మంత్రి లోకేష్ సూచించారు. అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని.. విద్యాశాఖ ఆధ్వర్యంలో కోటి మొక్కలు నాటుతామని వెల్లడించారు.