Home » Minister Nara Lokesh
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ జగన్ నాశనం చేసిన విద్యుత్ వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు తన అపార అనుభవంతో గాడిలో పెడుతున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. 22 నెలలుగా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ట్రూడౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది అని అన్నారు.
రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు ఈరోజు రాత్రికి ఢిల్లీకి వెళ్తుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఏప్రిల్ 2న పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతారని.. అక్కడ వైసీపీ వాళ్లు ఏం చేస్తారో చూడాలని మంత్రి అన్నారు.
వడ్డెర్ల సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. కూటమితోనే వడ్డెర్లకు ఆర్థిక, సామాజిక గుర్తింపు అని అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాల్లో ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) పేదలకు వివిధ రకాల సేవలు అందిస్తోందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆర్డీటీకి విదేశీ నిధుల అంశంలో ఉన్న సమస్య పరిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు సీఎం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆర్డీటీ కార్యకలాపాలు ఇకపై నిరంతరాయంగా కొనసాగనున్నాయి. ఆర్డీటీ సేవలు ఆగిపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చర్చలు జరిపారు.
విశాఖపట్నంలో మంత్రి నారా లోకేశ్ 84వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. విద్యుత్ శాఖ పోస్టుల భర్తీ, ఏయూ ఉద్యోగుల వయో పరిమితి పెంపు వంటి అంశాలపై మంత్రి వినతులు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తన కుమారుడు దేవాన్ష్తో కలిసి ఉగాది వేడుకలు నిర్వహించుకున్నారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, పండుగ వేళ కుటుంబంతో గడిపిన క్షణాలను ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 విజయవంతంగా ముందుకు సాగాలంటూ సీఎం ట్వీట్ చేశారు.
అమరావతిలోనే అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం పెడతామని చెప్పామని.. ఇప్పుడు చేసి చూపించామని మంత్రి లోకేశ్ అన్నారు. అమరావతిలో 58 అడుగుల పొట్టిశ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
దేవుని చెరువు ఘటనపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత తక్కువగా ఉందనే సమాచారం వచ్చిందని.. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.