Rowdy Gang Hulchul: గుంటూరు జిల్లాలో దారుణం.. గర్భవతిపై రౌడీమూకల దాడి
ABN , Publish Date - Jun 09 , 2025 | 08:55 AM
రౌడీమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఐదునెలల గర్భవతి , ఆమె భర్తపై విచక్షణారహితంగా దాడిచేశారు. ఈ సంఘటన తాడేపల్లి మండలం ఉండవల్లిలో జరిగింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

గుంటూరు జిల్లా: రౌడీమూకలు (Rowdy MoB Attack) మరోసారి రెచ్చిపోయారు. ఐదునెలల గర్భవతి, ఆమె భర్తపై విచక్షణారహితంగా దాడిచేశారు. ఈ దారుణం తాడేపల్లి మండలం ఉండవల్లిలో జరిగింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. భార్యాభర్తలు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఓ వ్యక్తి ఢీ కొట్టాడు. భార్య గర్భవతి కావడంతో భయాందోళనతో ద్విచక్రవాహనం దిగి మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని భర్త ఆనంద్ వారించాడు. భర్త కళ్ల ముందే భార్యను సదరు వ్యక్తి కొట్టాడు.
తనను కాపాడుకునే సమయంలో ఆ వ్యక్తిని బాధిత మహిళ చెప్పుతో కొట్టింది. ఆ వ్యక్తి మాత్రం తన ఫ్రెండ్స్ని పిలిచి భార్యాభర్తలపై అమానుషంగా దాడికి పాల్పడ్డాడు. తన భార్య గర్భవతి అని, వదిలేయమని ప్రాధేయపడుతున్నపటికీ ఇష్టారీతిగా ఇరువురిపై మూకుమ్మడిగా రౌడీ బ్యాచ్ దాడి చేశారని భర్త ఆనంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ దాడిలో పాల్గొన్న రౌడీ మూకలను గుర్తించడానికి స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. గాయపడిన భార్యభర్తలను హాస్పిటల్కి పోలీసులు తరలించారు. దాడిలో భార్యభర్తలు తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం వారు కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఇలాంటి దాడులకు పాల్పడిన రౌడీమూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు.
ఇవి కూడా చదవండి:
ఏఐసీసీ పెద్దలను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి ఎందుకంటే..
హమీల అమలుకు బాబు సర్కార్ వ్యూహరచన
For More AP News and Telugu News