Share News

Minister Satyakumar: వైసీపీ హయాంలో లిక్కర్‌లో భారీగా అవినీతి

ABN , Publish Date - May 12 , 2025 | 02:17 PM

Minister Satyakumar Yadav: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో కల్తీ మద్యంతో ప్రజలు చనిపోయారని అన్నారు. లిక్కర్ స్కాంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు.

Minister Satyakumar: వైసీపీ హయాంలో లిక్కర్‌లో భారీగా అవినీతి
Minister Satyakumar Yadav

విజయవాడ: వైసీపీ హయాంలో లిక్కర్‌లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satyakumar Yadav) ఆరోపించారు. ప్రభుత్వాధినేతగా ఉన్న వ్యక్తి.. గత హయాంలో సొంతంగా డిస్టిలరీలు పెట్టడం బాధాకరమని చెప్పారు. కల్తీ మద్యంతో కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులు పెరిగిపోయాయని అన్నారు. లిక్కర్ స్కాం అనేది క్షమించరాని నేరమని చెప్పారు. ఏపీలో మెడికల్ కాలేజీల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇంకా కాలేజీలు, సీట్లు పెరుగుతాయని చెప్పారు. విద్యార్ధుల సమస్యలను ఎన్ఎంసీ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఇవాళ(సోమవారం) విజయవాడలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.


ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మొట్టమొదటిసారిగా నర్సులకు ఐదు విభాగాల్లో అవార్డులు ఇచ్చామని చెప్పారు. ప్రతీఏడాది 34 వేల మంది నర్సులు చదువుకుని బయటకు వస్తున్నారని తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఎంఓయూ చేసుకుని 8 విదేశీ భాషలను నేర్పిస్తామని అన్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న 135 నర్సింగ్ కాలేజీలను గుర్తించామని తెలిపారు. న్యూరలాజికల్ సమస్యలు కూడా ఎక్కువగా వచ్చాయని చెప్పారు. 2024లో మాత్రమే 7800 న్యూరలాజికల్ కేసులు పెరిగాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

India- Pakistan War: రెండు దేశాల మధ్య కీలక చర్చలు

టిబెట్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి

ED Summons: సినీ నటుడు మహేష్ బాబుకు మరోసారి ఈడీ నోటీసులు..

For More AP News and Telugu News

Updated Date - May 12 , 2025 | 03:19 PM