Minister Kandula Durgesh: సినీ ఇండస్ట్రీపై మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - May 24 , 2025 | 08:08 PM
Minister Kandula Durgesh: సినీఇండస్ట్రీపై మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. హరిహర వీరమల్లు రిలీజ్కు ముందే థియేటర్ల బంద్ అంశం తెరపైకి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పదేళ్ల నుంచి ఉన్న సమస్య మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చిందని నిలదీశారు. ఎందుకిలా జరుగుతోంది.. వాస్తవాలు బయటకు రావాలని అన్నారు మంత్రి కందుల దుర్గేష్.

అమరావతి: సినిమా ఇండస్ట్రీకి (Film Industry) కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) తెలిపారు. ఇవాళ(శనివారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్లో(ABN Andhrajyothy Debate) మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని మాట్లాడారు. షూటింగ్లు, సినిమా టికెట్ల రేట్లు పెంచేందుకు ప్రభుత్వం అనుమతిస్తోందని ప్రకటించారు. హరిహర వీరమల్లు రిలీజ్కు ముందే థియేటర్ల బంద్ తెరపైకి వచ్చిందని.. దీనివెనుక ఉన్నది ఎవరని ప్రశ్నించారు. ఈ విషయంపై లోతైన విచారణ జరపాలని హోంశాఖను కోరానని అన్నారు మంత్రి కందుల దుర్గేష్.
ఈ వ్యవహారంలో పవన్ కల్యాణ్ డీప్గా హర్ట్ అయ్యారని తెలిపారు మంత్రి కందుల దుర్గేష్. సినిమా సమస్యల పరిష్కారానికి సహకరిస్తామని పవన్ చెప్పారని గుర్తుచేశారు. హరిహర వీరమల్లు రిలీజ్కు ముందే థియేటర్ల బంద్ అంశం తెరపైకి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పదేళ్ల నుంచి ఉన్న సమస్య మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చిందని నిలదీశారు. ఎందుకిలా జరుగుతోంది.. వాస్తవాలు బయటకు రావాలని అన్నారు. పవన్ కల్యాణ్ సినిమా సమయంలోనే ఇలాంటి పరిస్థితి రావడానికి కారణాలేంటని ప్రశ్నించారు. ఇందులో కుట్ర కోణం ఉందనే అనుమానం వ్యక్తం అవుతోందని చెప్పారు. పూర్తి వివరాలు తెలిసిన తర్వాతే తదుపరి యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో పవన్ కల్యాణ్ డీప్గా హర్ట్ అయ్యారని చెప్పారు. ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ కలిసి పనిచేయాలని కోరారు. ఇకపై ఇండివిడ్యువల్స్ను ఎంకరేజ్ చేయమని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
NITI Aayog Meeting: స్వర్ణాంధ్రపై చంద్రబాబు ప్రజెంటేషన్.. నీతి ఆయోగ్లో ప్రశంసల వర్షం
Tirumala: చంద్రబాబు వచ్చిన తర్వాత తిరుమలలో గత 11 నెలల్లో అనేక మార్పులు..
Read latest AP News And Telugu News