Minister Dola: ఏ ఒక్క ఉద్యోగిని తొలగించం... అవి అపోహలు మాత్రమే: మంత్రి డీబీవీ స్వామి
ABN , Publish Date - May 21 , 2025 | 06:59 PM
Minister Dola Bala Veeranjaneya Swamy: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కోసం జిల్లాలో మూడంచెల వ్యవస్థ తెస్తామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. ఉద్యోగుల సీనియారిటీతో పదోన్నతికి ఒక ప్రత్యేక చానల్ తెచ్చామని గుర్తుచేశారు.

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలను రేషనలైజేషన్లో (Rationalization) మూడు కేటగిరీలుగా విభజన చేశామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి (Minister Dola Bala Veeranjaneya Swamy) తెలిపారు. ఈ విషయంపై చాలామంది సిబ్బందిలో అపోహలున్నాయని.. ఏ ఒక్క ఉద్యోగిని తొలగించమని స్పష్టంచేశారు. ఉద్యోగుల మధ్య పని విభజనపై కూడా ఇప్పటికే స్పష్టత ఇచ్చామని అన్నారు. రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి అయ్యాకే.. అవసరాన్ని బట్టి ఉద్యోగుల బదిలీలు చేస్తామని స్పష్టం చేశారు. సాధారణ బదిలీల ప్రక్రియ మాదిరిగా వారి బదిలీలు ఉండవని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కోసం జిల్లాలో మూడంచెల వ్యవస్థ తెస్తామని ప్రకటించారు. ఉద్యోగుల సీనియారిటీతో పదోన్నతికి ఒక ప్రత్యేక చానల్ తెచ్చామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గుర్తుచేశారు.
రేషనలైజేషన్ వల్ల పని భారం తగ్గుతుందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. సచివాలయాల సంఖ్య పెరుగుతాయి...అంతే గాని తగ్గించమని స్పష్టం చేశారు. ఇవాళ(బుధవారం) వెలగపూడి సచివాలయంలో ఎస్సీ సబ్ప్లాన్ యాక్షన్ ప్లాన్పై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి ఎస్సీ కుటుంబానికి ప్రభుత్వం నుంచి లబ్ధి జరుగుతుందని అన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను వందశాతం ఎస్సీలకే వినియోగించాలని సూచించారు. నోడల్ ఏజెన్సీ అనుమతి లేకుండా ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆదేశించారు. ఎస్సీల విద్య, వైద్యం ఆరోగ్యం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఎస్సీ యువతకు స్వయం ఉపాధి, ఎస్సీ కాలనీల్లో మౌలిక సదుపాయాల గురించి మాట్లాడారు. నోడల్ ఏజెన్సీ అనుమతి లేకుండా ఎలాంటి పనులు చేపట్టవద్దని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీల ఆర్థిక, సామాజిక రాజకీయ అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Kumki Elephants: ఏపీకి కుంకీ ఏనుగులు అప్పగించిన కర్ణాటక ప్రభుత్వం
CM Chandrababu Yoga Day: ప్రపంచానికి భారత్ అందిస్తున్న వరం యోగా
Photo Controversy: మారని అధికారులు.. జడ్పీ ఆఫీస్లో జగన్ ఫోటో.. మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్యేలు
Minister Lokesh: కార్యకర్తల బాధ్యత నాదే.. ఇకపై నేరుగా కలుస్తా.. లోకేష్ కీలక నిర్ణయం
Read Latest AP News And Telugu News