CPI: కగార్ ఆపి.. మావోయిస్టులతో చర్చించాలి
ABN , Publish Date - May 26 , 2025 | 04:24 AM
విజయవాడలో సీపీఐ నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ‘ఆపరేషన్ కగార్’ను తక్షణమే ఆపాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని తీర్మానించారు. బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలని కూడా డిమాండ్ చేశారు.

సీపీఐ రౌండ్టేబుల్ సమావేశంలో తీర్మానాలు
విజయవాడ (గాంధీనగర్), మే 25(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తక్షణమే ‘ఆపరేషన్ కగార్’ను నిలుపుదల చేసి, మావోయిస్టులతో శాంతియుత చర్చలు జరపాలని ఆదివారం విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్టేబుల్ సమావేశం తీర్మానించింది. మావోయిస్టు నేత కేశవరావుతో పాటు ఇతర మృతుల భౌతికకాయాలను వారి బంధువులకు అప్పగించాలని, బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కూడా తీర్మానించారు. విజయవాడలో ఆదివారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్రం ఈ దమనకాండను ఆపాలని డిమాండ్ చేశారు.