Share News

AP nominated posts: కూటమిలో నామినేటెడ్‌ జోష్‌

ABN , Publish Date - May 12 , 2025 | 03:33 AM

ఏపీలో నామినేటెడ్‌ పదవుల భర్తీ కొనసాగుతూ తాజా జాబితాలో 22 కీలక కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు ప్రకటించారు. అమరావతి జేఏసీకి చెందిన ఇద్దరికి కీలక పదవులు లభించగా, టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 అవకాశం దక్కింది

AP nominated posts: కూటమిలో నామినేటెడ్‌ జోష్‌

మరో 22 కీలక పదవులు భర్తీ.. అమరావతి జేఏసీకి 2 కేటాయింపు

  • రాయపాటి శైలజకు మహిళా కమిషన్‌

  • ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా ఆలపాటి సురేశ్‌

  • టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి1

  • టీడీపీ 16 మందిలో 8 మంది బీసీలే

  • ఇప్పటిదాకా 101 కార్పొరేషన్‌ సీట్లు భర్తీ.. ఆప్కాబ్‌ చైర్మన్‌గా గన్ని

అమరావతి, మే 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవుల భర్తీ కొనసాగుతోంది. తాజాగా 22 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో అమరావతి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(జేఏసీ)కి చెందిన ఇద్దరికి కీలక పదవులు దక్కాయి. అమరాతి జేఏసీలో చురుగ్గా వ్యవహరించిన డాక్టర్‌ రాయపాటి శైలజను ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా, ఆలపాటి సురేశ్‌ను ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా నియమించారు. మొత్తం 22 పదవుల్లో టీడీపీకి 16, జనసేనకి 3, బీజీపీకి 1, అమరావతి జేఏసీకి 2 పదవులు దక్కాయి. టీడీపీ తీసుకున్న 16 పదవుల్లో 8 మంది బీసీలకు అవకాశం ఇవ్వగా మిగిలిన వారు ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారున్నారు. మాజీ మంత్రులు పీతల సుజాత, కేఎస్‌ జవహర్‌కు కార్పొరేషన్ల చైర్మన్‌ పదవులు దక్కాయి.


టీడీపీ ఆరోగ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్‌ జెడ్‌. శివప్రసాద్‌కు కూడా చైర్మన్‌ పదవి లభించింది. యువగళం పాదయాత్రలో లోకేశ్‌కు ఆరోగ్యపరమైన విషయాలను ఈయనే పర్యవేక్షించారు. గత ఏడాది సెప్టెంబరు 24న నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి విడతలో 20 కార్పొరేషన్లకు, తర్వాత అదే ఏడాది నవంబరులో 59 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. మధ్యలో ఏఎంసీలు, డీసీసీబీ, డీసీఎంఎ్‌సలకు నియామకం చేపట్టగా తాజాగా 22 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. దీంతో మొత్తం 101 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించినట్లయింది.

dscx.jpg

‘రెరా’ చైర్మన్‌గా శివారెడ్డి?

రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) చైర్మన్‌గా అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ చైర్మన్‌ శివారెడ్డిని ప్రభుత్వం నియమించనున్నట్టు తెలిసింది. ఆ మేరకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 22 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేసేందుకు సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. రెరా చైర్మన్‌ పోస్టును సెర్చ్‌ కమిటీ ద్వారా ఎంపిక చేస్తారు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ తుది ఎంపిక చేయాల్సి ఉండటంతో కొంత సమయం పట్టే అవకాశముంది. వైసీపీ హయాంలో రాజధాని అమరావతి కోసం పోరాడిన శివారెడ్డికి ఈ పదవిని ఇవ్వడం ద్వారా అమరావతి పరిరక్షణ సమితికి న్యాయం చేసినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.


sdf.jpg

ఆప్కాబ్‌ చైర్మన్‌గా గన్ని

  • విధేయతకు బాబు వీరతాడు

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(ఆప్కాబ్‌) చైర్మన్‌గా ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు నియమితులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పదవి కూడా ఆయనను వరించింది. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే అయిన గన్ని.. 2024 ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంగుటూరు స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీంతో గన్నికి ఎమ్మెల్సీ లేదా మరో పదవి ఇస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆరంభంలో మంత్రి లోకేశ్‌ ఉండి నియోజకవర్గ పర్యటనలో గన్నిని ఉద్దేశించి.. ‘రండి ఆప్కాబ్‌ చైర్మన్‌ గారూ..’ అని పలకరించారు. తాజాగా ఆప్కాబ్‌ చైర్మన్‌గా గన్ని నియమితులయ్యారు. కాగా.. తన మీద నమ్మకంతో డీసీసీబీ చైర్మన్‌ పదవితో పాటు ఆప్కాబ్‌ చైర్మన్‌గా నియమించడం పట్ల చంద్రబాబు, లోకేశ్‌లకు గన్ని కృతజ్ఞతలు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

పాక్ లో ప్రస్తుత పరిస్థితి .. చైనా శాటిలైట్ చిత్రాలు

Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు

Operation Sindoor: మరికొద్ది గంటల్లో హాట్ లైన్ చర్చలు.. రంగం సిద్ధం..

Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు

India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన

Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్‌నాథ్ సింగ్

For Andhrapradesh news and Telugu News

Updated Date - May 12 , 2025 | 03:33 AM