Home » Tollywood
నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడైన సిద్ధార్థ్రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. ట్రయల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, తెలంగాణ హైకోర్టు దాన్ని రెండేళ్లకు తగ్గించింది. ఈ తీర్పును సవాల్ చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థ్రెడ్డిని ఆదేశించింది.
నెట్ఫ్లిక్స్తో తన కల నిజం కాబోతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు తమ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీలో మార్పులు జరిగాయి. సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజను స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గద్దర్ పేరుతో ఇస్తున్న ఈ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమలో నూతన ఉత్తేజాన్ని నింపనున్నాయి..
నేడు 'హగ్ డే' పురస్కరించుకుని నటుడు నరేష్ హాట్ కామెంట్స్ చేశారు. సినిమా వేడుకకు హాజరైన ఆయన.. 'మిమ్మల్ని కూడా హగ్ చేసుకోవాలనే వచ్చాను కానీ.. మీరు లక్షణంగా చీరలు ధరించారు' అంటూ హీరోయిన్ల గురించి వ్యాఖ్యానించారు.
ప్రముఖ సింగర్ ఆర్జిత్ సింగ్ పశ్చిమ బెంగాల్లోని తన స్వస్థలం జియాజంగ్లో ‘హేషెల్’ పేరుతో ఓ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. తక్కువ ధరకే భోజనాన్ని అందిస్తున్నారు. వెజ్ భోజనం.. అది కూడా ఫుల్ మీల్స్ కేవలం రూ.40లకే అందిస్తున్నారు..
హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని అర్జున్ థియేటర్లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. మెగాస్టార్ సినిమా చూస్తూ ఆనంద్ కుమార్ అనే వ్యక్తి అకస్మాత్తుగా మృతిచెందడం కలకలం రేపింది.
తెలుగుజాతి గర్వించదగ్గ ముద్దు బిడ్డ సూపర్ స్టార్ కృష్ణ అని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసించారు. విజయవాడ లెనిన్ సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
రాజాసాబ్ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీఓ జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది..
ప్రముఖ సినీనటి మాధవీలతకు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో సాయిబాబా దేవుడు కాదని తప్పుడు ప్రచారాలు, వ్యాప్తి చేసినందుకు మాధవీలతపై కేసు నమోదు చేశారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో నిర్మాత సురేష్బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో ఆయన విజయం సాధించారు