Home » Rains
ఉత్తరప్రదేశ్లో ఇటీవల కురిసిన వర్షాలతో వరదలు భారీగా సంభవించాయి. ప్రధానంగా వారణాసి, ప్రయాగ్రాజ్లో పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
వానాకాలం ఇళ్లకే పరిమితం కాకుండా... వర్షంలో తడుస్తూ కొండలు, కోనలు... పచ్చని చెట్లను చూస్తూ... ప్రకృతిని ఆస్వాదించేవారు చాలామందే ఉంటారు. వర్షాల్లో పర్యాటకం కచ్చితంగా సరికొత్త అనుభూతినిస్తుంది. అయితే ఈ కాలంలో సాఫీగా ప్రయాణం చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. నిపుణులు ఏం చెబుతున్నారంటే...
ఉత్తర కర్ణాటక జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి. బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు, బాగల్కోట, బెళగావి జిల్లాల్లో నదులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదుల సమీపంలో ఉన్న గ్రామాలు నీట మునిగాయి. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది.
పడమటి గాలుల వేగంలో మార్పుల కారణంగా రాష్ట్రంలో ఆగస్టు 2 నుంచి 5వ తేది వరకు ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షం కురిసే అవకాశముంది. ఈ మేరకు ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
దిల్లీలో ఈరోజు భారీ వర్షం కురుస్తోంది. దీంతో విమానయాన సంస్థలు ప్రయాణీకులకు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. గాలులతో కూడిన ఈ వర్షం వల్ల విమాన సేవల్లో జాప్యం జరిగే అవకాశం ఉందని తెలిపాయి.
వర్షాకాలంలో మొబైల్ సిగ్నల్ సమస్యలు రావడం సర్వసాధారణం. దట్టమైన మేఘాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కారణంగా సిగ్నల్స్ బలహీనంగా మారవచ్చు. ఇలాంటి సమయాల్లో తక్షణమే హై-స్పీడ్ నెట్వర్క్ పొందేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో రాబోయే రెండు రోజులు పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరకోస్తా తీరం వెంట బలమైన ఈదురు గాలులు ఉంటాయని... ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
నగరంలో శుక్రవారం ఉదయం నుంచీ చిరుజల్లులు పడుతుండగా, రాత్రి గంటపాటు దంచికొట్టింది. 8.30 తర్వాత గంటపాటు భారీ వర్షం కురిసింది. దీంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, మెహిదీపట్నం, లంగర్హౌస్, షేక్పేట, కూకట్పల్లి ప్రాంతాల్లో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ జాం సమస్యలు తలెత్తాయి.
ఆలస్యంగా వచ్చినా జోరుగానే వచ్చి రైతులను మురిపిస్తోంది వాన! రాష్ట్రవ్యాప్తంగా గురువారం కూడా పలుచోట్ల వర్షాలు పడ్డాయి. ఉదయం నుంచే ఆకాశం మబ్బు పట్టింది.
గత ఏడాది కనీవిని ఎరుగని రీతిలో మున్నేటికి వరద ముప్పు రావడంతో వందలాది మంది నిరాశ్రయులుగా మారారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మళ్లీ అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు.