Home » Rains
విజయనగరం, మన్యం, విశాఖ, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఉరుములు, పిడుగుల సమయంలో బయట తిరగొద్దని హెచ్చరించారు.
హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొట్టింది. కూకట్పల్లి, మియాపూర్, ఫిల్మ్ నగర్ వంటి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
మన్నార్ గల్ఫ్ నుంచి దక్షిణ కర్ణాటక అంతర్గత ప్రాంతాలు, తమిళనాడు, పరిసరాల్లో కేరళ ఆనుకొని ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 24 వరకు ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్లో కురిసిన అకాల వర్షాలు రైతన్నల నడ్డి విరిచాయి. ముఖ్యంగా నంద్యాల వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగళ్ల వాన దంచికొట్టింది.
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్జైన్ తెలిపారు. భారీ వానల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఏపీలో అకాల వర్షాలపై మంత్రి అచ్చెన్నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను త్వరితగతిన గుర్తించి, నష్టాన్ని నమోదు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవల కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న తరుణంలో.. సోమవారం నుంచి ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లో ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. మిర్చితో సహా పలు పంటలకు తీవ్ర నష్టం వాటిళ్లింది. అలాగే పలుచోట్ల విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగింది..