Home » Puducherry
పుదుచ్చేరి రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పుదుచ్చేరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడైన ఏవీ సుబ్రమణియన్ పార్టీలోని తన పదవులన్నింటికీ రాజీనామా చేశారు.
తమిళనాడు, పుదుచ్చేరిలో 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఈ మేరకు చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి.
పుదుచ్చేరిలో సిట్టింగ్ మంత్రులు, కీలక నేతలకు మరోసారి అవకాశం కల్పించడం ద్వారా 'ప్రో-ఇంకంబెన్సీ'ని వాడుకోవాలని బీజేపీ చూస్తోంది. అటు కేరళలో సినీ నటులు (వివేక్ గోపన్), సామాజిక సమీకరణలతో అభ్యర్థులను ఎంపిక చేయడం విశేషం.
పుదుచ్చేరిలోని ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీయేలో సీట్ల పంపకాలు ఖరారయ్యారు. ఆ ప్రకారం ఏఐఎన్ఆర్సీ 16 సీట్లలో పోటీ చేయనుండగా, భాగస్వామ్య పక్షమైన బీజేపీ 10 సీట్లలో పోటీ చేయనుంది.
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తూత్కుకుడిలోని తిరుచెందూరు ఆలయాన్ని పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి శుక్రవారంనాడు సందర్శించారు. బీజేపీతోనే ఎన్ఆర్ కాంగ్రెస్ పొత్తు ఉంటుందని, నామినేషన్ తేదీ కంటే ముందే సీట్ల పంపకాలు ఖరారు అవుతాయని ఈ సందర్భంగా చెప్పారు.
కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే నాలుగు రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. రెండు విడతల్లో ఈ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ యోచిస్తున్నట్టు సమాచారం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రాత్రి చెన్నై బయలుదేరి వెళ్తున్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో మార్చి 1న పర్యటిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీకి టార్చిలైట్ గుర్తును భారత ఎన్నికల సంఘం మంగళవారంనాడు కేటాయించింది. 2026 పుదుచ్చేరి ఎన్నికల్లో ఎంఎన్ఎం పోటీ చేసేందుకు ఈ గుర్తును కేటాయించినట్టు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
అస్సాం, కేరళ, రాజస్థాన్, తమిళనాడు-పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్కు సీనియర్ పరిశీలకులను ఏఐసీసీ నియమించింది.
టీవీకే నేతపై ఎస్పీ ఈషా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ 41 మందిని పొట్టనబెట్టుకున్నారు.. ఇక్కడా అవే వేషాలా?.. అనుమతి మేరకు నడుచుకోండి. సభకు భద్రత కల్పించడమెలాగో నాకు తెలుసు. మీలాంటి వారి సలహాలు నాకు అక్కర్లేదు. జాగ్రత్తగా మసలుకోండి.. అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనానికి దారితీశాయి.