మద్యం ప్రియులకో బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు.. బీరుకు రూ.10, క్వార్టర్కు రూ.6 నుండి రూ.30 వరకు
ABN , Publish Date - May 29 , 2025 | 01:39 PM
మద్యం ప్రియులు నిజంగా ఇది బ్యాడ్ న్యూసే.. ప్రభుత్వం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బీరుకు రూ.10, క్వార్టర్కు రూ.6 నుండి రూ.30 వరకు పెంచింది. పెరిగిన ఈ రేట్లు బుధవారం నుంచే అమలులోకి వచ్చాయి.

చెన్నై: కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో మద్యంపై పెంచిన ధరలు బుధవారం నుండి అమలులోకి వచ్చింది. బీరుకు రూ.10, క్వార్టర్ బాటిల్ రూ.6 నుండి రూ.30 వరకు ధర పెంచుతూ ఆ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. పుదుచ్చేరి రాష్ట్ర అసెంబ్లీలో మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాలో ముఖ్యమంత్రి రంగస్వామి పలు సంక్షేమ పథకాలను ప్రకటించారు. ఈ పథకాలను విజయవంతంగా నిర్వహించాలంటే ప్రభుత్వానికి అదనంగా రూ.500 కోట్లు అవసరమని, ఆ స్థాయి నిధులు ప్రభుత్వ ఖజానాలో లేనందునప్రభుత్వ ఆదాయం పెంచాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ అంశంపై ముఖ్యమంత్రి రంగస్వామి(Chief Minister Rangaswamy) నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఆ రాష్ట్రప్రజలపై ఆర్ధిక భారం మోపకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే దిశగా మద్యం ధరలను పెంచాలని నిర్ణయించారు. ఆ మేరకు మద్యంపై ఎక్సైజ్ సుంకం, దుకాణాలకు లైసెన్స్ ఫీజు పెంచాలని నిర్ణయిచారు. రెండు నెలల అనంతరం మద్యం ధరలను పెంచుతూ బుధవారం విడుదల చేసిన జీవో వెంటనే అమలుకు వచ్చింది.
ఈ జీవో ప్రకారం క్వాంటిటీని బట్టి ఒక్కో మద్యం సీసాకు రూ.6 నుండి రూ.120 వరకు ధర పెంచారు. అదేవిధంగా బీరు సీసాపై రూ.5 నుండి రూ.10 వరకు పెంచిన ధర వెంటనే అమలుకు వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. 750 మి.లీ. ఫుల్బాటిల్కు బ్రాండును బట్టి రూ.24 నుండి రూ.120 వరకు ధర పెంచడంపై మందుబాబు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Dog Attack: ఐదేళ్ల బాలిక ప్రాణం తీసిన పిచ్చికుక్క
Read Latest Telangana News and National News