Chief Minister: కారులోనే.. ముఖ్యమంత్రి భోజనం
ABN , Publish Date - May 20 , 2025 | 11:07 AM
ముఖ్యమంత్రి పర్యటన అంటే ఎంత హడావుడి ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే.. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి మాత్రం ఓ సాధారణ వ్యక్తిగా కారులోనే భోజనం చేశారు. సాధారణ పౌరులకు ఇబ్బంది కలగకుండా వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపించి అందులోనే భోజనం చేశారు.

పుదుచ్చేరి: కేంద్ర పాలిత రాష్ట్రం పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి(Chief Minister Rangaswamy) హంగులు, ఆర్భాటాలు లేని సాధారణ ముఖ్యమంత్రిగా పేరుగాంచారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజలు ఆయన్ను ఏ క్షణంలోనైనా కలుసుకోవచ్చు. అలాగే, ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా తన కారుకు ముందు భద్రతా వాహనాలు వెళ్లరాదని ఆయన ఆజ్ఞలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో, ఆదివారం పుదుచ్చేరి కదిర్గామం నియోజకవర్గంలో రూ.2 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రంగస్వామి ప్రారంభించారు.
ఈ వార్తను కూడా చదవండి: Operation Sindoor: యావత్ పాక్ను టార్గెట్ చేసే మిలిటరీ సామర్థ్యం భారత్కు ఉంది: ఆర్మీ ఉన్నతాధికారి
అనంతరం షణ్ముగపురం ఆడిటోరియం సమీపం వాలీబాల్ కోర్టు భూమి పూజకు సీఎం బయల్దేరారు. ఆదివారం కావడంతో పర్యాటకుల రద్దీ అధికంగా ఉండడంతో ట్రాఫిక్ రద్దీలో సీఎం వాహనం చిక్కుకుంది. దీంతో, సీఎం వాహనం వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. అందుకు వారిని వారించిన సీఎం, తన కారును రోడ్డు పక్కగా నిలపమని డ్రైవర్కు సూచించి, ట్రాఫిక్ నియంత్రించాలని పోలీసులను ఆదేశించారు. అప్పటికే మధ్యాహ్న భోజనం సమయం కావడంతో, సీఎం తన కారులోనే భోజనం పూర్తిచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
Rice Production: సస్యశ్యామల భారతం
Siricilla : పాత బకాయిలు లేనట్లేనా..?
Telangana fire services: ఇక.. మహిళా ఫైర్ఫైటర్లు
Read Latest Telangana News and National News