Home » Leopard
కర్ణాటక రాష్ట్రం, రాయచూరు జిల్లాలోని సింధనూరు తాలూకా రౌడకుందా గ్రామ సమీపంలో గల గుట్ట పై చిరుత సంచారాన్ని గ్రామస్థులు గుర్తించారు. కొన్నాళ్ల క్రితం గ్రామానికి చెందిన పశువులు అకస్మాత్తుగా చనిపోగా కొన్నింటి పై చిరుత దాడి జరిగినట్లు రైతులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
మంచిరేవుల గ్రే హౌండ్స్ పక్కనే ఉన్న చిలుకూరు మృగవని పార్కులో చిరుత సంచరిస్తున్నట్లు నిర్ధారణ అయింది. అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాలో చిరుత జాడ కనిపించింది. 15 రోజులుగా చిరుతపులి సంచారం నేపథ్యంలో అధికారులు ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు.
తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు ప్రాంతంలో రిజర్వు ఫారెస్ట్ పరిధిలోవున్న గ్రామాల్లో చిరుతపులి సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తిరుత్తణి నుండి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు వరకు విస్తరించివున్న దట్టమైన అడవులు, పర్వతశ్రేణులు, జంతువులతో పచ్చటి ప్రకృతి సౌందర్యం, రమణీయమైన వాతావరణాల మధ్య చిన్నచిన్న గిరిజన గ్రామాలు, తండాల ప్రజలు నివసిస్తుంటారు.
Leopard Scare: రంగారెడ్డి జిల్లాలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. చిరుతలను బంధించేందుకు అటవీశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
రాయచూరు తాలూకాలోని డి.రాంపూర్ (డొంగరాంపూర్) సమీపంలోని పరమేశ్వర గుట్టలో మరో సారి చిరుత(Leopard) సంచారం కలకలం రేపుతోంది.
గ్రామస్థులంతా కలిసి చిరుతను బంధించారు. మంగళవారం బాగేపల్లి తాలూకా పరిధిలోని వర్లకొండ గ్రామం వరాహగిరి కొండపై కరేనహళ్ళికి చెందిన రైతుపై చిరుత దాడి చేసింది.
తమిళ నాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లా వాల్పారైలో బాలికను హతమార్చిన చిరుత అటవీశాఖ ఏర్పాటుచేసిన బోనుకు చిక్కింది. పచ్చమలై ఎస్టేట్లోని తేయాకు తోటలో పనిచేస్తున్న జార్ఖండ్కు చెందిన మనోన్ముండా, మోనిక దంపతుల పెద్ద కుమార్తె రోషిణి ఇంటి బయట ఆడుకుంటుండగా చిరుత బాలికను నోట కరుచుకుని అడవిలోకి లాక్కెళ్లింది.
Viral Video: అరటి తోటలోకి వెళ్లిన తర్వాత ఆ వ్యక్తి చిరుత నుంచి తప్పించుకున్నాడు. జనాల దాడిలో తీవ్రంగా గాయపడ్డ చిరుత మాత్రం తోటలోనే ఉండిపోయింది. చిరుత గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం వెళ్లింది.
కర్నూలు జిల్లాలో ఆదివారం రెండు చిరుతలు కలకలం రేపాయి. కోసిగిలోని పులికనుమ ప్రాజెక్టు సమీపంలోని బసవన్న కొండ దగ్గరలోని ఎర్రవంకలో ఓ చిరుతపులి గాండ్రిస్తూ.. నడవలేని స్థితిలో ఉంది.
బెంగళూరు నగర పరిసరాలలో 85 చిరుతలు ఉన్నట్లు పర్యావరణ నిపుణుడు డాక్టర్ సంజయ్గుబ్బి నేతృత్వంలోని హోళిమత్తె నేచర్ ఫౌండేషన్ బృందం అధ్యయనంలో గుర్తించింది. కెమెరా ట్రాప్ల ఆధారంగా ఏడాదిపాటు అధ్యయనం చేశారు.