Home » ICC
భారత్లో ఐసీసీ టోర్నీలకు సంబంధించి మీడియా హక్కుల ఒప్పందం నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జియోస్టార్ తప్పుకున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఐసీసీ-జియోస్టార్ స్పందించాయి. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాయి.
ఫిబ్రవరి 7 నుంచి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. భారత్-శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీనికి సంబంధించిన టికెట్ల విక్రయాలు మొదలయ్యాయి. చాలా తక్కువ ధరకే టికెట్లు అమ్ముతుండటం విశేషం.
టీ20 ప్రపంచ కప్2026ను భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీకి జియో హాట్ స్టార్ షాకిచ్చింది.
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ ఫఖర్ జమానాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ముక్కోణపు సిరీస్లో అంపైర్లతో వాగ్వాదం కారణంగా.. అతడి ఫీజులో పది శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ జత చేసింది.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు టీమిండియా స్టార్ బ్యాటర్ షఫాలీ వర్మ నామినేట్ అయింది. మహిళల వన్డే ప్రపంచ కప్లో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన షఫాలీ ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.
యాషెస్ సిరీస్లో భాగంగా ఆసీస్- ఇంగ్లండ్ జట్లు పెర్త్ వేదికగా తొలి టెస్టులో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఆసీస్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఆట కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. తాజాగా పెర్త్ పిచ్కు ఐసీసీ రేటింగ్ ఇచ్చింది.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టాప్-5లోకి దూసుకొచ్చాడు. రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. శుభ్మన్ గిల్ నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో టీమిండియా సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మహిళల క్రికెట్ విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి మహిళల వన్డే ప్రపంచ కప్ 2029లో జట్ల సంఖ్య ఎనిమిది నుంచి పది పెంచాలని నిర్ణయించింది.
సాధారణంగా క్రికెట్ ఆటలో బ్యాటర్లు తరచుగా బౌలర్లను అయోమయానికి గురిచేయడానికి, ఫీల్డింగ్ సెటప్ను దెబ్బతీయడానికి వింత వింత షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగా, కొందరు బ్యాటర్లు స్టంప్ల వెనుకకు, మరికొందరు పిచ్పై నుంచి పూర్తిగా పక్కకు జరిగి షాట్లు ఆడటం చేస్తుంటారు.
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో శ్రీలంక, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ మ్యాచ్ ఫలితం టీమిండియాకు లాభాన్ని చేకూర్చింది.