Home » HYDRA
వరదనీరు సున్నం చెరువులో కలిసేలా మురుగునీరు కిందకు పోయేలా నాలాల నిర్మాణం ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులకు సూచించారు. బోరబండ, సున్నం చెరువు ప్రాంతాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. అల్లాపూర్, బోరబండ డివిజన్లను కలుపుతూ సాగే నాలాలను విస్తరించాలన్నారు.
నగరంలోని నాలాలు, క్యాచ్పిట్లు, కల్వర్టుల్లోని చెత్తను హైడ్రా బృందాలు తొలగిస్తున్నాయి. హైడ్రా డీఆర్ఎఫ్ (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు), ఎంఈటీ (మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్స్) బృందాలు నిరంతరాయంగా నాలాల్లో చెత్తను తొలగిస్తున్నాయి.
మూసీని మూసేసి దర్జాగా దందా చేస్తున్న అక్రమార్కులకు హైడ్రా చెక్ పెట్టింది. నదిని వ్యర్థాలతో నింపి నిర్మించిన ఆక్రమణలను తొలగించింది.
మూసీనది గర్భంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. చాదరఘాట్ బ్రిడ్జి నుంచి పాతబస్తీ ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వరకు పలు ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించారు. ఈ స్థలాన్ని వాహనాల పార్కింగ్ కోసం ఆక్రమణ దారులు వినియోగిస్తున్నారు.
హైడ్రా నగరానికి రక్షణగా నిలిచిందని, ఆక్రమణదారుల పట్ల బుల్డోజర్లా వ్యవహరించిందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న చర్యల గురించి కమిషనర్ సోమవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
భారీ వర్షం కారణంగా హైదరాబాద్ లోని రాయదుర్గం, షేక్ పేట్ మార్గంలో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. నగరంలో భారీ వర్షాలు కొనసాగే పరిస్థితుల నేపథ్యంలో నగరవాసులకు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలతో సామాజిక కోణంలో చూసి పేదల ఇళ్లు కూల్చడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. కబ్జాలు చేసిన వారే హైడ్రాపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. సెప్టెంబర్ 21వ తేదీన బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని రంగనాథ్ పేర్కొన్నారు.
హైడ్రా.. రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంస్థ అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న సంస్థ..
భాగ్యనగరంలో హైడ్రా అధికారుల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వరుసగా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. శుక్రవారం కూకట్పల్లి బాలాజీనగర్ డివిజన్ హబీబ్నగర్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
పాత బస్తీలోని సూరం చెరువులో నిర్మించిన ఒవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ కాలేజీ నడుస్తోందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. అందుకనే ఈ కాలేజీని కూల్చివేయడానికి ఆలోచిస్తున్నామని ఏవీ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు.