Home » Hero Vijay
సార్వత్రిక ఎన్నికలకు తేదీ దగ్గర పడుతున్నాకొద్దీ రాష్ట్రంలో రాజకీ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒంటరిగా పోటీ చేయాలా... లేక కూటమిలో చేరాలా అన్నదానిపై నిర్ణయాధికారం విజయ్దేనని టీవీకే పార్టీ నేతలు తెలిపారు. ఈమేరకు టీవీకే జిల్లా కార్యదర్శుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో.. అగ్రహీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్కి అతని సన్నిహితుడు, ఇప్పటివరకు ఆయన వెన్నంటి ఉన్న పీటీ సెల్వకుమార్ ఝలక్ ఇచ్చారు. ఆయన టీవీకేని వదిలి డీఎంకే పార్టీలో చేరారు.
రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కోవి చెళియన్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కావాలనుకుంటున్న విజయ్ కల ఫలించదు.. అంటూ ఆయన పేర్కొన్నారు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అది కలగానే మిగిలిపోతుందే తప్ప నిజం కాదంటూ ఆయన అన్నారు.
టీవీకే నేతపై ఎస్పీ ఈషా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ 41 మందిని పొట్టనబెట్టుకున్నారు.. ఇక్కడా అవే వేషాలా?.. అనుమతి మేరకు నడుచుకోండి. సభకు భద్రత కల్పించడమెలాగో నాకు తెలుసు. మీలాంటి వారి సలహాలు నాకు అక్కర్లేదు. జాగ్రత్తగా మసలుకోండి.. అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనానికి దారితీశాయి.
డీఎంకే నేతల మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవదు.. మోసపోవద్దు.. అని టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ అన్నారు. పుదుచ్చేరిలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు మోసపూరిత హామీలతో వస్తుంటారని, కానీ ఓటర్లు నమ్మవద్దన్నారు.
అగ్రహీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ పుదుచ్చేరిలో నిర్వహించతలపెట్టిన రోడ్షోలకు అనుమతి ఇవ్వలేమంటూ.. పోలీస్ శాఖ పేర్కొంది. చిన్ననగరమైన పుదుచ్చేరిలో రోడ్షో నిర్వహిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, తమిళనాడులో లాగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ పోలీస్ శాఖ పేర్కొంది.
డిసెంబరు 5న పుదుచ్చేరిలో రోడ్ షోకు అనుమతి ఇవ్వాలని ఆపార్టీ నేతలు దరఖాస్తు చేసుకున్నారు. కరూర్ లో హీరో, టీవీకే పార్టీ నేత విజయ్ పాల్గొన్న సభలో తొక్కిసలాట జరిగి 41మంది మరణించిన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ సభలకు ముందస్తు అనుమతులకు దరఖాస్తు చేసుకున్నారు.
రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రఘుపతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ‘సి’ టీం టీవీకే పార్టీ.. అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని లేపుతున్నాయి. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో ‘పొలిటికల్ హీట్’ బాగా పెరిగిపోయింది.
టీవీకే పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ హీరో విజయ్పై డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత ఆగ్రహం వ్యక్తం చేశారు. కరూర్లో టీవీకే ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ విజయ్ మాత్రం నోరు మెదపకపోవడం ఎంతో వేదనకు గురిచేస్తోందని ఆమె అన్నారు.
తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, ప్రముఖ హీరో విజయ్కి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయన సభలకు అనుమతి ఇవ్వలేం.. అంటూ పేర్కొనడం తమిళనాట ఇప్పుడు సంచలనానికి దారితీస్తోంది. కరూర్ లో విజయ్ పాల్గొన్న సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణింంచిన సంగతి తెలిసిందే..