Home » Annamalai
వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. అన్నామలై, మందకృష్ణ మాదిగ, స్మృతి ఇరానీ వంటి పేర్లు చర్చల్లో ఉన్నాయి
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న కె.అన్నామలై హిమాలయాలకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ బాబా గుహలో ఆయన ధ్యానం మొదలుపెట్టారు. గత రెండు రోజుల క్రితమే ఆయన బీజేపీ రాష్ట చీఫ్ పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష్యుడుగా నయినార్ నాగేంద్రన్ ఎన్నిక కానున్నారు. అధ్యక్ష్య పదవికి జరిగిన ఎన్నికల్లో నయినార్ నాగేంద్రన్ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో అధికారిక ప్రకటన లాంఛనమే అయింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరనే చర్చకు కొద్దిరోజుల్లో తెరపడనుందా. దక్షిణ భారతం నుంచే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నారా. దక్షిణ భారతదేశం నుంచి జాతీయ అధ్యక్షుడిని నియమించాలని బీజేపీ భావిస్తే ఆ ఎంపిక ఎవరు..
తమిళనాడు బీజేపీ అధ్యక్షపదవికి అజిత్ అన్నామలై కొనసాగాలని ఆసక్తి వ్యక్తం చేయలేదు. బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నా ఆయన దీనిపై మరింత వివరణ ఇవ్వనున్నట్లు చెప్పారు
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో పొత్తులపై కేంద్రంలో చర్చలు జరుగుతున్నాయి. అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి కె పళనిస్వామి ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్షాను కలిశారు.
ప్లీజ్.. అన్నామలైని మార్చొద్దు.. ఆయన వచ్చాకే పార్టీ చాలా డవలప్ అయింది.. అంటూ నగరంలో పలుచోట్ల వాల్పోస్టర్లు వెలిశాయి. అన్నామలైని మారుస్తున్నారంటూ ఇటీవల ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఈ నేపధ్యంలో ఆయనను మార్చొద్దంటూ నగరంలో పలుచోట్ల ఈ వాల్పోస్టర్లు వెలవడం ఇప్పుడు చర్చానీయాంశమైంది.
మాకు అన్నామలై కావాలి.., అన్నాడీఎంకేతో కూటమి వద్దు.. అంటూ వెలిసిన పోస్టర్లు తమిళనాట కలకలం పుట్టిస్తున్నాయి.. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి పోస్టర్లు వెలుగుచూడడంతో ఇప్పుడు పెద్దఎత్తున చర్చకు దారితీస్తోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుతోపాటు మరో సీనియర్ నేతపై స్థానిక పోలీసులు కేసునమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వాఖ్యలు చేశారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, ఆ పార్టీ సీనియర్ నేత హెచ్.రాజాపై సేలం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయావశమైంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సహా 1,078 మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే.. ఈ విషయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనానికి దారితీసింది. అనుమతిలేకుండా ఆందోళన చేశారంటూ కేసునమోదు చేశారు.