Home » Anantapur urban
కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా స్కేటర్స్ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆదివారం స్థానిక జేఎనటీయూ నుంచి శారదానగర్, కలెక్టరేట్, పూలే సర్కిల్, సప్తగిరి సర్కిల్, సుభాష్రోడ్డు మీదుగా టవర్క్లాక్ వరకు స్కేటింగ్ క్రీడాకారులు ఐదు కిలోమీటర్ల పాటు ర్యాలీ నిర్వహించారు.
మండలంలోని పోలేపల్లి బీసీ కాలనీలో తీవ్రమైన తాగునీటి ఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. గ్రామంలో ఆరు పంచాయతీ బోర్లు ఉండగా అందులో మూడు పూర్తిగా ఎండిపోయాయి. మిగిలిన మూడు బోర్లలో భూగర్భజలాలు తగ్గడంతో నీరు తక్కువగా వస్తోంది. గ్రామంలోని బీసీకాలనీలో దాదా పు 200 ఇళ్ల వరకు ఉండగా వారికి తాగునీరే రావడం లేదు. వారు వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి వ్యాన్లలో, ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చు కుంటున్నారు.
చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే భృతిని రూ. 20వేలకు పెంచి నందుకు టీడీపీ బెస్త సాధికార సమితి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. టీడీపీ బెస్త నాయకులు మేక చంద్రబాబు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కుళ్లాయప్ప, బెస్త సాధికార సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు చేపల హరి తదితరులు ఆదివారం టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబునాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
లారీ ఢీకొనడంతో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని విద్యుత స్తంభం విరిగిపోయిం ది. దీంతో యా ర్డుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత సరఫరా నిలిచిపోయింది. శనివారం ఉదయం 11గంటల సమయంలో చీనీకాయల లోడింగ్ కోసం యార్డులోని చీనీ మార్కెట్లోకి లారీ వచ్చింది. లారీని రివర్స్ చేసే క్రమంలో విద్యుత స్తంభాన్ని ఢీ కొట్టింది. స్తంభం విరిగిపోయింది.
కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ నివారం సాయంత్రం లోక కల్యాణం కోసం లక్షపు ష్పార్చన కార్యక్రమాన్ని వై భవంగా నిర్వహించారు. కార్యక్రమానికి వైశ్య కుల గురువు పూజ్యశ్రీ వామనా శ్రమ స్వామీజీ హాజరై వాసవీమాతకు పుష్పార్చన చేశారు. అలాగే ఆలయ ఆ వరణలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక లలితా సహస్రనామావళితో లక్షపుష్పా ర్చన చేశారు.
ఉగ్రవాదం నశించాలి... హిందూ ముస్లిం బాయి.. బాయి అంటూ.... పహల్గాంలో ఉగ్రవాదుల దా డిని నిరసిస్తూ మాజీసైనికులు శనివారం నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వ హించారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కెప్టెన షేకన్న ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన బిల్లులు జమ కాకపోవడంతో పనిచేసే కూలీల ఖాతాల్లోకి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో కూలీకి దాదాపు పన్నెండు వారాలకు పైగా బిల్లులు రావాల్సి ఉందని చెబుతున్నారు. బిల్లులు సకాలంలో జమకాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాగుకు అవసరమైన నీటి కేటాయింపులతోనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన(ఎ్సఐఎ్సఏ) ఆధ్వర్యంలో సోమవారం ఓ సదస్సును నిర్వహించారు.
గుడ్ ప్రైడే రోజు సీఎం చంద్రబాబునాయుడు క్రైస్తవులకు గుడ్న్యూ అందిం చారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం గుడ్ ప్రైడే సందర్భంగా అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయంలో టీడీపీ క్రిస్టియన సెల్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి దాస్, పలువురు పాస్టర్లు ఎమ్మెల్యేతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
గుడ్ఫ్రైడేని పుర స్కరించుకుని శుక్రవారం జిల్లావ్యాప్తంగా ప్రార్థనలను ఘనంగా నిర్వ హించారు. మానవాళికోసం యేసుక్రీస్తు తన ప్రాణాన్ని త్యజించిన శుభ శుక్రవారం సందర్భంగా వాడవాడలా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని క్రీస్తు మందిరాలన్నీ కిటకిటలాడాయి. నగరం లోని అరవిందనగర్లో ఉన్న సీయస్ఐ హోలి ట్రినిటి చర్చిలో ప్రెస్బిటర్, సీయస్ఐ హెచ్టీసీ అనంతపురం డివిజనల్ చైర్మన్ పీడీఎస్జే బెనహర్ బాబు ఆధ్వర్యంలో శుభ శుక్రవారపు ఆరాధనను నిర్వహించారు.