Home » Anantapur urban
ఇంటర్ విద్యార్థిని తన్మయి మర్డర్ మిస్టరీ అనంతపురంలో సంచలనం రేకెత్తించింది. ఈ కేసుకు సంబంధించి సిఐ పలు వివరాలు వెల్లడించారు. విద్యార్థిని కనపడ్డం లేదని 4వ తేదీన ఆమె తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు.
జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని పురస్కరించుకుని శనివారం హెచ్చెల్సీ కాలనీలో గల కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.
ఏసీఏ క్రికెట్ పోటీల్లో జిల్లా జట్టు విజయం సాధించింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన ఆధ్వర్యంలో కడప నగరంలోని వైఎస్సార్ స్టేడియంలో జిల్లా అం డర్-23 ఛాంపియనషి్ప పోటీల్లో శనివారం కడప జట్టుతో జిల్లా జట్టు తలపడింది.
క్రమం తప్పకుండా యోగాసనాలు వేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్లా పరిషత చైర్పర్సన గిరిజమ్మ సూచించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా పంచాయతీ అధికారి నాగరాజనాయుడు ఆధ్వర్యంలో నగరంలోని ఎంవైఆర్ ఫంక్షన హాల్లో యోగాసనాలు వేసే కార్యక్రమం చేపట్టారు.
అర్హులైన సీనియర్ టీచర్లకు ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వాలంటూ పలువురు టీచర్లు చేపట్టిన ధర్నా శనివారం మూడో రోజూ కొనసాగింది. బదిలీల ప్రక్రియ జరుగుతున్న నగరంలోని శారదాస్కూల్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. బాధిత టీచర్లకు పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.
హామీలు అమలు చే యడం లేదని ప్రభుత్వం విమర్శలు చేస్తున్న వారికి బుద్ధి చెప్పేవిధం గా ఈ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అ మలవుతాయని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఆమె శనివా రం మండలంలోని కక్కలపల్లికాలనీ పంచాయతీ పిల్లిగుండ్ల కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టారు.
మహానాడుతో వైసీపీ శ్రేణుల మైండ్ బ్లాక్ అయిందని, అది చూసి వారికి ఏం చేయాలో తెలి యక వెన్నుపోటు దినోత్సవం అంటూ హడావుడి చేస్తున్నారని ఎమ్మె ల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. తాము జూన 4వ తేదీన ‘విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన శనివారం మండలంలోని ఎ.నారాయణపురం పంచాయతీ సోమనాథ్నగర్ చౌరస్తా నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించారు.
జిల్లా జైలును, ఓపె నర్ జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి ఎన రాజశేఖర్ మంగళవారం తనిఖీ చేశారు. జైలులో ఉన్న ఖైదీలతో మాట్లాడారు. అక్కడ ఉన్న సదుపాయాలతో పాటు అందుతున్న వైద్య సేవలు, సమస్యలపై ఆరా తీశారు.
ఆధునిక సమాజంలో చోటు చేసుకున్న మూ ఢవిశ్వాసాలను నిర్మూ లించేందుకు కందు కూరి వీరేశలింగం పం తులు జీవితాన్ని, ఆ యన రచనలను మ నం చదవాలని తెలు గు వెలుగు సాహిత్య సామాజిక సేవాసంస్థ అధ్యక్షుడు టీవీ రెడ్డి అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడవాలని పేర్కొన్నారు. నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు 106వ వర్ధంతిని మంగళవా రం తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవాసంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం లోని విశాలాంధ్ర బుక్ హౌస్లో నిర్వహించారు.
రాయలసీమ అభివృద్ధికి కృషి చేసిన సర్ థామస్ మన్రో అనంత ఆత్మబంధువుగా ప్రజ ల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని సీనియర్ రచయిత డాక్టర్ పతికి రమేష్ నారాయణ అన్నారు. మర్రో 264వ జయంతిని పురస్క రించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలోని క్లాక్టవర్ కూడలి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.