Share News

జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు జగిత్యాలకు పార్టీ పెద్దలు

ABN , Publish Date - Mar 24 , 2026 | 09:18 AM

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు మాజీ మంత్రి, సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి ప్రకటించారు. అందుకు ముహూర్తాన్ని సైతం ఆయన ఫిక్స్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగింది.

జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు జగిత్యాలకు పార్టీ పెద్దలు

హైదరాబాద్, మార్చి 24: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు మాజీ మంత్రి, సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి ప్రకటించారు. అందుకు ముహూర్తాన్ని సైతం ఆయన ఫిక్స్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగింది. మంగళవారం జగిత్యాలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో పాటు విప్ అది శ్రీనివాస్ పయనమయ్యారు. పార్టీని వీడవద్దంటూ ఆయనకు నచ్చజెప్పేందుకు తమ వంతు ప్రయత్నం చేయనున్నారు. అదీకాక మార్చి 25వ తేదీన తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ఇప్పటికే టి. జీవన్ రెడ్డి ప్రకటించిన విషయం విదితమే.


జీవన్ రెడ్డి రాజీనామా గడువు సమీపిస్తుండడంతో.. పార్టీ అధిష్ఠానం అప్రమత్తమైంది. పార్టీని వీడకుండా ఉండేందుకు ఆయనకు నచ్చ చెప్పాలంటూ న్యూఢిల్లీలోని పార్టీ అధిష్ఠానం పెద్దలు రాష్ట్ర నాయకులకు కీలక సూచనలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పార్టీ నేతలు.. జగిత్యాలకు ప్రయాణం కట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతిపై ఎవరు కుట్రలు చేసినా ఉపేక్షించేది లేదు: మంత్రి అనిత

నేటి నుంచి కుప్పంలో పర్యటించనున్న భువనమ్మ

For More TG News And Telugu News

Updated Date - Mar 24 , 2026 | 12:18 PM