జర్నలిస్టు రేవతి అరెస్ట్‌పై మంత్రి క్లారిటీ

ABN, First Publish Date - 2025-03-15T11:29:30+05:30 IST

Telangana Assembly: మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్‌పై అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. జర్నలిస్టులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవం ఉందన్నారు.

హైదరాబాద్, మార్చి 15: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session) కొనసాగుతున్నాయి. ఇటీవల మహిళా జర్నలిస్ట్ రేవతి, ఆమె భర్త అరెస్ట్ విషయాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) సభ ముందుకు తీసుకొచ్చారు. గ్రామాల్లో కరెంట్ రాలేదని, పంట ఎండిపోతుందని అనే విషయాన్ని జర్నలిస్టులు అడిగితే వారిపై కూడా కేసులు పెడుతున్నారని, మహిళా జర్నలిస్టులపై కేసులు పెట్టే దుస్థితి ఏ ప్రభుత్వంలో లేదని అన్నారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జర్నలిస్టు రేవతి అరెస్ట్‌పై క్లారిటీ ఇచ్చారు. అలాంటి వీడియోలను సమర్థిస్తున్నారంటే బీఆర్‌ఎస్ ఎంతటి ఫస్ట్రేషన్‌లో ఉన్నారో అర్థమవుతోందని అన్నారు.


జర్నలిస్టులంటే తమకు గౌరవం ఉందన్నారు. ఇంత వరకు కాంగ్రెస్ పార్టీ సొంత పత్రికలు, సొంత టీవీలు పెట్టుకోలేదన్నారు. జర్నలిస్టు రేవతికి సంబంధించిన వీడియోను చూస్తే ఎలాంటి భాష ఉపయోగించారో మీకే తెలుస్తోంది. వెంటనే జర్నలిస్టులకు మద్దతుగా మాట్లాడిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మంత్రి పొన్నం అన్నారు.


ఇవి కూడా చదవండి...

justice for Viveka: ఆరు ఏళ్లుగా పోరాడుతున్నా.. వివేకా కుమార్తె కన్నీరు

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ

సైదాబాద్ ఆలయంలో యాసిడ్ దాడి

Read Latest Telangana News And Telugu News

Updated at - 2025-03-15T11:29:31+05:30