TamilNadu Government: వెయ్యి కిలోల బంగారు కానుకలు .. తమిళనాడు సర్కార్.. ఏం చేసిందంటే..

ABN, Publish Date - Apr 19 , 2025 | 09:19 AM

భక్తులు దేవుడిని ఏదైనా కోరిక కోరుకోవడం, ఆ కోరిక తీరితే కానుకలు ఇస్తానని మొక్కుకోవడం సనాతన సంప్రదాయంలో పరిపాటి. కోరికలు తీరగానే భక్తులు తమ తాహతుకు తగిన విధంగా కానుకలు ఇస్తుంటారు. వాటిలో బంగారు అభరణాలు కూడా ఉంటాయి.

భక్తులు దేవుడిని ఏదైనా కోరిక కోరుకోవడం, ఆ కోరిక తీరితే కానుకలు ఇస్తానని మొక్కుకోవడం సనాతన సంప్రదాయంలో పరిపాటి. కోరికలు తీరగానే భక్తులు తమ తాహతుకు తగిన విధంగా కానుకలు ఇస్తుంటారు. వాటిలో బంగారు అభరణాలు కూడా ఉంటాయి. అలా భక్తులు కానుకగా ఇచ్చిన బంగారు అభరణాలను కొన్ని ఆలయాలు బ్యాంకుల్లో పెట్టేస్తున్నాయి. మరికొన్ని దేవాలయాల్లో మాత్రం ఎలాంటి ఉపయోగం లేకుండా పడి ఉంటున్నాయి.


అలా నిరుపయోగంగా పడి ఉన్న బంగారంతో అద్భుతాలు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైంది. ఆ బంగారాన్ని కరిగించి బ్యాంకు స్కీముల్లో పెట్టెసింది. తమిళనాడులో అడుగడుగునా ఆలయం ఉంది. తమిళనాడు వ్యాప్తంగా 3000కు పైగా ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి.


అయితే కొన్ని దేవాలయాలు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. ఈ ఆలయాలను సందర్శించడానికి భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటారు. స్వామివారికి తమ శక్తికొలదీ బంగారం, వెండి వంటి విలువైన వస్తువులతో పాటు నగదు కూడా భక్తులు సమర్పిస్తారు. ఇలా భక్తులు సమర్పించిన బంగారు వస్తువుల నుంచి డబ్బు సంపాదించడం ప్రారంభించింది తమిళనాడు సర్కార్. 21 దేవాలయాల్లో సుమారు వెయ్యి కిలోల ఉపయోగించని బంగారాన్ని ముంబై తీసుకువెళ్లి అక్కడ కరిగించి 24 క్యారెట్ల బంగారు కడ్డీలుగా తమిళనాడు ప్రభుత్వం మార్చింది. వాటిని భారతీయ రిజర్వ్ బ్యాంకులో గోల్డ్ ఇన్వెస్ట్ స్కీం కింద డిపాజిట్ చేసింది. తద్వారా దాంతో వచ్చే ఆదాయాన్ని ఆలయాల అభివృద్ధికి ఉపయోగించనుంది.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

ఈ వార్తలు కూడా చదవండి

TTD Donation Management: గోవిందుడి ఖజానా మరింత భద్రం

Minister NMD Farooq: మైనార్టీలకిచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యం

Kasireddy Rajasekhar Reddy: ముందస్తు బెయిలివ్వండి అరెస్టు నుంచి కాపాడండి

Read Latest AP News And Telugu News

Updated at - Apr 19 , 2025 | 10:00 AM