High Court: హైకోర్టులో ఘనంగా ఆవిర్భావ వేడుకలు
ABN , Publish Date - Jun 03 , 2025 | 03:45 AM
హైకోర్టులో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి) : హైకోర్టులో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్రెడ్డి, అదనపు ఏజీలు ఇమ్రాన్ఖాన్, తేరా రజినీకాంత్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్, రిజిస్ర్టీ అధికారులు పాల్గొన్నారు. కాగా, అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ ప్రసాద్కుమార్, శాసనమండలి ఆవరణలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అంతకుముందు వారు అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ, బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా, డీజీపీ కార్యాలయంలో తెలంగాణ అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐజీ ఎం. శ్రీనివాసులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..
చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..
Read Latest Telangana News And Telugu News