RRR: ఏకకాలంలో ఆర్ఆర్ఆర్ ఉత్తర, దక్షిణ భాగాల నిర్మాణం?
ABN , Publish Date - Jun 13 , 2025 | 04:39 AM
రీజనల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర, దక్షిణ మార్గాలు ఒకేసారి నిర్మించే అవకాశాలపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గురువారం ఆర్ఆర్ఆర్ ఉత్తర/ దక్షిణ మార్గాలపై సీఎం రేవంత్రెడ్డి సమీక్షించారు.

దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం.. రీజినల్ రింగు రోడ్డుపై సీఎం సమీక్ష
దక్షిణభాగం అలైన్మెంట్పై కీలక సూచనలు
త్వరలో కేంద్రానికి నివేదిక
కేంద్రం ఆలస్యం చేస్తే హెచ్ఎండీఏతో నిర్మాణంపై ఫోకస్..!
హైదరాబాద్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): రీజనల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర, దక్షిణ మార్గాలు ఒకేసారి నిర్మించే అవకాశాలపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గురువారం ఆర్ఆర్ఆర్ ఉత్తర/ దక్షిణ మార్గాలపై సీఎం రేవంత్రెడ్డి సమీక్షించారు. దక్షిణ భాగంలో అలైన్మెంట్ ప్రాథమికంగా ఖరారైందని ఆయనకు అధికారులు తెలిపారు. దీనిపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేసి కేంద్రానికి నివేదించాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంతోపాటు దక్షిణ భాగం నిర్మించాలని కోరుతూ పలుమార్లు ప్రధాని మోదీ, కేంద్ర రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీలకు సీఎం రేవంత్రెడ్డి వినతి పత్రాలు సమర్పించారు. ఒకవేళ ఉత్తర భాగంతోపాటు దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ నిర్మాణంపై కేంద్రం ఆలస్యం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన అంశాలపై కీలకంగా సీఎం సమీక్షించారు. దక్షిణ భాగ నిర్మాణానికి ఎప్పుడు ఆమోదం తెలుపుతారన్న విషయమై కేంద్రం నుంచి స్పష్టత తీసుకోనున్నారు. ఈ విషయంలో జాప్యం చేస్తే.. హైదరాబాద్ మెట్రో డెవల్పమెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) పరిధిలో నిర్మాణానికి గల అవకాశాలను పరిశీలించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అలా నిర్మాణం చేపడితే తీసుకోవాల్సిన చర్యలు, ఆర్థికాంశాలపై అధికారులకు సీఎం రేవంత్ పలు కీలక సూచనలు చేసినట్లు వినికిడి.
వాస్తవంగా ఉత్తర భాగం కంటే దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో వేగంగా అభివృద్ధి జరుగుతుందనే చర్చ తొలి నుంచీ ఉంది. కానీ గత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఆర్ఆర్ఆర్ మంజూరైంది. దీంతో కేంద్రంతో చర్చించిన గత ప్రభుత్వం తొలుత ఉత్తరభాగం నిర్మాణానికి ఆమోదం లభించేలా చర్యలు తీసుకోవడంతో దక్షిణ భాగం మార్గానికి ఆమోదం ఆలస్యమవుతూ వచ్చింది. రాష్ట్రంలో 2023లో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ఆర్పై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు ఉత్తర భాగంలో ఆటంకాలన్నీ పరిష్కరించింది. కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించగానే ఉత్తరభాగం నిర్మాణం నిర్మాణానికి మార్గం సుగమమవుతుంది. రెండు భాగాలు ఒకేసారి నిర్మిస్తే నిర్మాణ వ్యయంతోపాటు దక్షిణ భాగ భూముల సేకరణకు పరిహారం ధరలు తక్కువగా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే రాష్ట్ర ప్రభు త్వం వివరించినా కేంద్రం సమాధానమూ చెప్పలేదు.. నిర్ణయమూ తీసుకోలేదు. కేంద్ర నిర్ణయానికనుగుణంగా ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిర్ణయానికి రావాలని సమీక్షలో ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. అయినా, దక్షిణ భాగం విషయమై మరోమారు కేంద్ర మంత్రులను కలిసి వివరించాలనుకుంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఆర్ఆర్ఆర్ వరకూ నిర్మించే రేడియల్ రోడ్లు, హైబ్రీడ్ యాన్యునిటీ మోడల్లో అభివృద్ధి చేసే రోడ్లపైనా సమీక్షించారు.
హైకోర్టులో సీఎం రేవంత్రెడ్డికి ఊరట
‘కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఎత్తేస్తారు’ అని వ్యాఖ్యానించడంతోపాటు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో వైరల్ చేసిన అంశంలో నిందితుడిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. నాంపల్లి మేజిస్ట్రేటు కోర్టులో ఉన్న ఈ కేసుపై ఈ నెల 23 వరకు ఎలాంటి విచారణ జరగకుండా స్టే విధించింది. బీజేపీ, అమిత్ షాపై తప్పుడు ప్రచారం చేసిన రేవంత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీజే పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వ ర్లు దిగువ కోర్టులో ప్రయువేటు కంప్లెంట్ దాఖలు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈనెల 23 వరకు దిగువ కోర్టులో విచారణలో ఉన్న అన్ని రకాల ప్రొసీడింగ్స్పై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం.. ఆయన చివరి ఫొటో ఇదే..
లోపం ఉందని ముందే చెప్పినా.. పట్టించుకోని ఎయిర్ ఇండియా
For National News And Telugu News