CM Relief Fund: సీఎం సహాయనిధిలో అవకతవకలు..ప్రభుత్వం సీరియస్
ABN , Publish Date - Apr 23 , 2025 | 09:09 AM
CM Relief Fund: సీఎం సహాయ నిధిలో కొన్ని ఆస్పత్రులు అవకతవకలకు పాల్పడు తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం ఆ ఆస్పత్రులపై సీరియస్ అయింది. వైద్యశాఖ దీనిపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రంగారెడ్డి జిల్లా: ముఖ్యమంత్రి సహాయ నిధిలో అవకతవకలకు పాల్పడినట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. దీంతో వెంటనే వైద్యశాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగి ఈ విషయంపై సీరియస్గా దృష్టి సారించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి తప్పుడు బిల్లులతో అవకతవకలకు పాల్పడిన హాస్పిటళ్లను జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎంవీ ఇందిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా వద్ద గల హిరణ్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను అధికారులు సీజ్ చేశారు.
ఈ ఆస్పత్రులను నిర్వహిస్తున్న యాజమాన్యం గత కొంతకాలంగా ముఖ్యమంత్రి సహాయనిధికి సంబంధించి తప్పుడు బిల్లులతో అవకతవకులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో వైద్యశాఖ ఈ అంశంపై విచారణ చేపట్టింది. ఈ మేరకు జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు, జిల్లా ఉప వైద్యాధికారి గీత, సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం ఆస్పత్రులను సీజ్ చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధిలో తప్పుడు బిల్లులతో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యాశాఖ అధికారులు హెచ్చరించారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
MLC Election: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ ప్రారంభం..
TGSRTC: ఆర్టీసీలో సమ్మెకు సై...జేఏసీకి సంఘాల మద్దతు
Osmania University: ఆర్ట్స్ కాలేజీకి ట్రేడ్ మార్క్ గుర్తింపు
Ponguleti Srinivas Reddy: ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చర్యలు
Read Latest Telangana News And Telugu News