Share News

Owaisi: పర్యాటకుల మతం అడిగి పాశవికంగా కాల్చారు

ABN , Publish Date - Apr 25 , 2025 | 04:30 AM

పహల్గాం ఉగ్రదాడిలో పర్యాటకుల మతం అడిగి పాశవికంగా కాల్చిన ఉగ్రవాదులకు తగిన శిక్ష విధించాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఉగ్రవాదులకు పాకిస్థాన్ మద్దతు ఉందని ఆరోపించిన ఆయన, కేంద్రం తీసుకునే శాంతి భద్రతా చర్యలకు మజ్లిస్ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు

Owaisi: పర్యాటకుల మతం అడిగి పాశవికంగా కాల్చారు

  • ఉగ్రవాదులకు గుణపాఠం నేర్పాలి

  • ఉగ్ర వాదులకు పాకిస్థాన్‌ మద్దతు: ఒవైసీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్ర మూకలకు తగిన గుణపాఠం నేర్పాలని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు. శాంతి భద్రతలను కాపాడేందుకు కేంద్రం తీసుకునే చర్యలకు మద్దతు ఇస్తామన్నారు. పర్యాటకుల మత విశ్వాసాలను తెలుసుకుని ఉగ్రవాదులు పాశవికంగా కాల్చి చంపారని, వీరి తూటాలకు ఓ ముస్లిం యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడని ఒవైసీ తెలిపారు. ఉగ్ర వాదులకు పాకిస్థాన్‌ మద్దతు ఉందని ఒవైసీ ఆరోపించారు. ఉగ్రవాదాన్ని తుదముట్టేంచే చర్యలకు మజ్లిస్‌ మద్దతు ఇస్తుందన్నారు.


ఇవి కూడా చదవండి

Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..

Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్

Updated Date - Apr 25 , 2025 | 04:30 AM