MLA: సీఎంగారూ.. తులం బంగారం ఎక్కడా..
ABN , Publish Date - May 03 , 2025 | 10:15 AM
అబద్దపు మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అన్ని రంగాల్లో విఫలమైందని మాజీమంత్రి పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు. అంతేగాక కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలకు తులం బంగారం ఇస్తామని నమ్మబలికి మోసం చేసిందని ఆమె విమర్శించారు.

హైదరాబాద్: పేదింటి ఆడబిడ్డల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంలో దేశంలోనే తొలిసారిగా మాజీ సీఎం కేసీఆర్ విప్లవాత్మకంగా కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టారని మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే పట్లోళ్ల సబితారెడ్డి(MLA Pattolla Sabitha Reddy) పేర్కొన్నారు. సరూర్నగర్, ఆర్కేపురం డివిజన్లకు చెందిన 99 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను సరూర్నగర్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆమె లబ్ధిదారులకు అందజేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: వాట్సాప్లో వల.. చిక్కితే విలవిల
ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చే రూ.1,00,116 తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన గడిచినా నేటికీ అమలు చేయలేదని, రేవంత్రెడ్డి తులం బంగారం ఎక్కడా అని ఆమె ప్రశ్నించారు. 420 హామీలకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ ఏ ఒక్క హామీని సరిగా అమలు చేయలేదని, ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని తాము వదిలిపెట్టకుండా ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.
కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్, నాయబ్ తహసీల్దార్ జంగయ్య, సరూర్నగర్ సర్కిల్ ఉపకమిషనర్ సుజాత, కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, బీఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్శర్మ, యూత్వింగ్ మాజీ అధ్యక్షుడు లోకసాని కొండల్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Rates Today: రెండో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు..ఇంకా తగ్గుతాయా..
Lift Irrigation: మళ్లీ సీడబ్ల్యూసీకి ‘పాలమూరు’ డీపీఆర్
Kishan Reddy: ఓల్డ్ సిటీకీ నిధులు కేటాయించాలి
పెద్దపల్లి ఎయిర్పోర్టు.. బసంత్నగర్లో కాదు.. అంతర్గాంలో!
Read Latest Telangana News and National News