Share News

MLA: ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు..

ABN , Publish Date - Jun 14 , 2025 | 10:28 AM

కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజల కనీస అవసరాలైన మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదని, నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

MLA: ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు..

- కూకట్‌పల్లిలో నీటి ఇబ్బందులు లేకుండా చూడాలి

- కబీర్‌నగర్‌ నాలాపై స్లాబ్‌ ఏర్పాటు చేయండి

- ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

హైదరాబాద్: కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజల కనీస అవసరాలైన మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదని, నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) అన్నారు. మూసాపేటలో మాజీ కార్పొరేటర్‌ తూము శ్రవణ్‌కుమార్‌తో కలసి మూసాపేటలోని మైసమ్మ చెరువుతో పాటు పలు ప్రాంతాలను శుక్రవారం పరిశీలించారు. చెరువు వద్ద నాలా నిర్మాణం చేసే సమయంలో రిటర్నింగ్‌ వాల్‌ ఎత్తు పెంచి బ్రిడ్జి నిర్మాణం చేయాలని అధికారులకు సూచించారు.


అనంతరం వార్డు కార్యాలయంలో పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మూసాపేట డివిజన్‌కు చెందిన కాలనీవాసులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గంలో లక్షల గ్యాలన్ల సామర్థ్యం ఉన్న నీటి ట్యాంకులను గతంలోనే నిర్మించామని, ఎక్కడా నీటి సమస్య తలెత్తకుండా జలమండలి అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. కబీర్‌నగర్‌ నాలా పనులు పూర్తిచేసి దానిపై స్లాబ్‌ నిర్మించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.


city6.2.jpg

బాలాజీ స్వర్ణపురి కాలనీలో డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని, ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఎవరూ ప్రవర్తించిన ఊరుకునేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. వీధి దీపాల సమస్యను కూడా పరిష్కరించాలన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, ఏ సమస్య ఉన్న తనకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ డివిజన్‌ అంబటి అధ్యక్షుడు శ్రీనివాస్‌, మహిళా నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం మళ్లీ లక్ష

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన బాలకృష్ణ

Read Latest Telangana News and National News

Updated Date - Jun 14 , 2025 | 10:28 AM