Harish Slams Uttam: ఉత్తమ్ ఏం చెప్పినా అబద్ధమే.. హరీష్ ఆగ్రహం
ABN , Publish Date - Jun 06 , 2025 | 03:26 PM
Harish Slams Uttam: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలలో ముఖ్యమంత్రి రేవంత్ను ఉత్తమ్ మించిపోయారని వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ ఏది మాట్లాడినా అబద్దమే అని అన్నారు.

సిద్ధిపేట, జూన్ 6: రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సమావేశం నిరాశపరిచిందని మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. గాలి మోటార్పై తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక్క డీఏ ఇచ్చేందుకు ముచ్చటగా మూడు కమిటీలు వేశారని... దీనికి కేబినెట్లో అయిదు గంటల చర్చ చేశారని వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం నిట్ట నిలువునా ముంచుతోందన్నారు. తక్షణమే మూడు డీఏలు చెల్లించాలని బీఆర్ఎస్ (BRS) పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.
ఉద్యోగస్తులపై సర్కార్ కేసులు పెడుతోందన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి గ్రామాల్లో పనులు నిర్వహిస్తున్నారని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అబద్ధాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) మించిపోయారని వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ ఏది మాట్లాడినా అబద్దమే అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో క్రాప్ హాలిడే ప్రకటించిందన్నారు. 65 టీఎంసీల నీటిని ఉపయోగించకుండా చేసింది ఉత్తమ్ అంటూ ఆరోపించారు. నీతి ఆయోగ్ మీటింగ్లో ప్రధానిని రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు.
గోదావరి బనకచర్ల కోసం బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు వెళ్తుందన్నారు. గోదావరి బనకచర్ల మీద బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. శ్రీశైలం రైడింగ్ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టును ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుకోవాలన్నారు. కాళేశ్వరం కుప్ప కూలిందని చెప్పే రేవంత్ రెడ్డి గంగమళ్ళకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. కాళేశ్వరం కూలిందని కాంగ్రెస్ ప్రభుత్వం గ్లోబల్ ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
మెడపై తుపాకీ పెట్టినా నిజాలే చెబుతా.. కమిషన్ విచారణపై ఈటెల
అంతా నిజమే చెబుతా.. ఈటెలతో కమిషన్ ప్రమాణం
Read Latest Telangana News And Telugu News