KTR: గ్రేటర్ నేతలతో నేడు కేటీఆర్ సమావేశం
ABN , Publish Date - Apr 19 , 2025 | 06:59 AM
గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ నేతలతో ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కే. తారకరామారావు శనివారం సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో పార్టీ రజతోత్సవ మహాసభకు జన సమీకరణపై చర్చించనున్నారు.

- స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పష్టతనిస్తారా?
హైదరాబాద్ సిటీ: గ్రేటర్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ నేతలతో బీఆర్ఎస్(BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) నేడు సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో పార్టీ రజతోత్సవ మహాసభకు జన సమీకరణపై చర్చించనున్నారు. నగరం నుంచి భారీ ఎత్తున వరంగల్లోని ఎల్కతుర్తికి తరలివెళ్లాలని భావిస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: జీతాలు, అద్దెలు లేవ్..
ఇదే సమావేశంలో హైదరాబాద్(Hyderabad) జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఎన్నికల్లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొంటారా? లేదా? అన్న దానిపై స్పష్టత వస్తుందని ఓ కార్పొరేటర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
బస్తర్లో కాల్పుల విరమణ అత్యవసరం
ఆర్ఎస్ఎస్ తరహాలో.. ప్రజల్ని కలవండి
గ్రూప్-1 నోటిఫికేషన్ను రద్దు చేయండి
Read Latest Telangana News and National News