Jagga Reddy: సీఎం రేవంత్, కాంగ్రెస్పై మళ్లీ నోరు జారితే.. నడిరోడ్డుపై బట్టలిప్పి గుంజీలు తీయిస్త
ABN , Publish Date - May 12 , 2025 | 04:17 AM
సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీలపై మరోమారు మళ్లీ నోరు జారితే బట్టలిప్పి నడిరోడ్డుపై గుంజీలు తీయిస్తానంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి హెచ్చరించారు.

ఇప్పటికైనా నల్లికుట్ల రాజకీయం మానుకో
నియోజకవర్గ సమస్యలపై సీఎంను ఏనాడైనా కలిశావా?
నీ పార్టీలో పదవి రాక సైకోలా మారావు
నువ్వు పార్లీమెంటరీ భాషలో ప్రశ్నిస్తే
అదే భాషలో సమాధానం ఇస్తాం
బూతులు మాట్లాడితే.. బూతులతోనే సమాధానం
నువ్వు అడవిలో తుపాకులు పడితే..
మేము జనంలోనే తుపాకులు పట్టినోళ్లం
కాంగ్రెస్ పార్టీ జోలికొస్తే.. ఊడదీసుడే!
ఈటల రాజేందర్పై జగ్గారెడ్డి ఫైర్
హైదరాబాద్, మే 11(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీలపై మరోమారు మళ్లీ నోరు జారితే బట్టలిప్పి నడిరోడ్డుపై గుంజీలు తీయిస్తానంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా ఆయన నల్లికుట్ల రాజకీయాలు మానుకోవాలంటూ హితవు పలికారు. గాంధీభవన్లో ఆదివారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్పైన ఈటల రాజేందర్ తన పరిధిని దాటి మాట్లాడాడని, అందుకే తానూ పరిధిని దాటి సమాధానం ఇస్తున్నానన్నారు. నియోజకవర్గ సమస్యలపైన సీఎం రేవంత్రెడ్డిని ఈటల ఏనాడైనా కలిశారా అంటూ నిలదీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కావాలని కలలు కన్న ఈటల రాజేందర్కు అవి రాకపోయే సరికి సైకోలాగా మారాడన్నారు. తన పార్టీలో పదవి కోసమే సీఎం రేవంత్ను తిడుతున్నాడని పేర్కొన్నారు. ‘‘ఏదైనా విషయం ఉంటే సీఎంను ప్రశ్నించు.. డిమాండ్ చేయి! అంతే కానీ.. సీఎంను పట్టుకుని కొడకా అంటావేంటిరా? ఏం భాషరా అది? సీనియర్ నాయకుడు.. బాధ్యత గల ఎంపీ లెక్క నీ మాటలు లేవు.
రెగ్యులర్గా గంజాయి తాగే వాడే ఇలాంటి భాష మాట్లాడతడు. ఏం.. నిన్ను అనలేమా.. కొడకా అని? మేము తిట్టడం మొదలెడితే ఉరేసుకుని చస్తవు!’’ అంటూ ఈటలపై ఫైర్ అయ్యారు. పదవి రాక నిరాశతో మాట్లాడుతున్నాడన్న జాలితో ఈటల రాజేంర్ను సీఎం రేవంత్రెడ్డి వదిలేస్తుండొచ్చునని, కానీ తాము అలా వదిలేయమన్నారు. ఈటల.. పార్లమెంటరీ భాషలో ప్రశ్నిస్తే అదే భాషలో సమాధానం ఇస్తామని చెప్పారు. బూతులు మాట్లాడితే బూతులతోనే సమాధానం చెబుతామన్నారు. గతంలో ఎప్పుడూ కులం గురించి చెప్పుకోని ఈటల రాజేందర్.. ఈ మధ్య కుల రాజకీయాలూ చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూపాయి తెప్పించే సోయి కూడా లేదన్నారు. ‘‘ఎంపీనీ.. నేను తోపుని అనుకోకు. అడవిలో తుపాకులు పట్టిన అని అనుకుంటున్నవేమో! మేము జనంలోనే తుపాకులు పట్టినోళ్లం. ఇంకోసారి సీఎం రేవంత్, కాంగ్రెస్ జోలికి వస్తే ఊడదీసుడేనంటూ హెచ్చరించారు. తాము సాఫ్ట్గా ఉంటే. సాఫ్టుగాను, మొరటుగా ఉంటే మొరటుగాను సమాధానం ఇస్తామని జగ్గారెడ్డి అన్నారు.
ఇవి కూడా చదవండి
Drunk Driving Incident: మద్యం తాగుతూ ఫుల్ స్పీడ్తో రైడ్.. వీడియో వైరల్
Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం
Read Latest Telangana News And Telugu News