Jagga REddy: బండి సంజయ్, కిషన్ రెడ్డిని తిరగనివ్వం.. కేంద్రానికి జగ్గారెడ్డి ప్రశ్నలు
ABN , Publish Date - Jun 02 , 2025 | 05:45 PM
కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి వెంటనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో వారిద్దరినీ తెలంగాణ గడ్డపై ప్రతిఘటిస్తామని ప్రకటించారు.

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి వెంటనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో వారిద్దరినీ తెలంగాణ గడ్డపై ప్రతిఘటిస్తామని ప్రకటించారు. ఇవాళ గాంధీ భవన్లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పాలన్న జగ్గారెడ్డి.. కేంద్ర ప్రభుత్వం నిద్రావస్థలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ పొరపాట్లను కప్పిపుచ్చుకోవడానికి రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తున్నారని జగ్గా విమర్శించారు.
ప్రతి అంశాన్ని రాజకీయం కోసం వాడుకోవడం బీజేపీకి అలవాటైందన్న జగ్గారెడ్డి.. పాకిస్తాన్తో యుద్ధాన్ని ఎందుకు ఆపాల్సి వచ్చిందని నిలదీశారు. ఈ దేశ నిర్ణయాలు ఇండియా ప్రధాని తీసుకుంటాడా? ట్రంప్ తీసుకుంటాడా? అంటూ ప్రశ్నించారు. తప్పులన్నీ చేసి ఇప్పుడు బండి సంజయ్, కిషన్ రెడ్డి తమాషాలు చేస్తున్నారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ట్రంప్ చెప్తే సైలెంట్ అవడానికి సిగ్గు ఉందా? వాజ్పేయి పుట్టినరోజున నవాజ్ షరీఫ్ దగ్గరికి వెళ్ళి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం మోదీకి ఎందుకు వచ్చింది'. అంటూ జగ్గారెడ్డి ప్రశ్నలు లేవనెత్తారు.
ఇవీ చదవండి:
జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..
జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి