Share News

ED: సినీ హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు

ABN , Publish Date - Apr 22 , 2025 | 07:47 AM

హైదరాబాద్: టాలీవుడ్ సినీ హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్ల వ్యవహారంలో అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 27న విచారణకు హజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.

ED: సినీ హీరో మహేశ్ బాబుకు  ఈడీ నోటీసులు
Tollywood Star Mahesh Babu

హైదరాబాద్: టాలీవుడ్ (Tollywood) సినీ హీరో (Cine Hero) మహేష్ బాబు (Mahesh Babu)కు ఈడి నోటీసులు (ED Notice) ఇచ్చింది. సురానా గ్రూప్ (Surana Group), సాయి సూర్య డెవలపర్‌ల (Sai Surya Developers) వ్యవహారంలో అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 27న విచారణకు హజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇటీవలే సాయి సూర్య, సురాన గ్రూప్‌లలో ఈడీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. యాడ్స్‌లో నటించినందుకు 3.4 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ప్రమోషన్స్ కింద రెండు కంపెనీల నుండి నగదు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం రూ. 5.9 కోట్లు తీసుకున్నారని.. రూ. 3.4 కోట్ల నగదు, రూ. 2.5 ఆర్‌టీజీఎస్ (RTGS) ద్వారా తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. కాగా ఈనెల 16న హైదరాబాదులో సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్లలో ఈడీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే.

Also Read..: గరిష్ఠ స్థాయిల్ని తాకుతోన్న పసిడి..


సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్లలో ఈడీ అధికారులు చేసిన సోదాల్లో భాగంగా సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. సురానా ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ, సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీశ్ చంద్రగుప్త ఇంట్లో కూడా భారీగా నగదును సీజ్ చేశారు. సాయి సూర్య, సురానా కార్యాలయాల్లో పలు డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే సాయి‌సూర్య డెవలపర్స్‌కు చెందిన సతీ‌శ్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వట్టి నాగులపల్లి‌లో వెంచర్ పేరుతో డబ్బులు వసూలు చేసి సతీశ్ మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ పోలీస్ కేసు ఆధారంగా సాయి సూర్య డెవలపర్స్‌పై ఈడీ విచారణ చేపట్టింది. సురానా సంస్థ పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

సునారా గ్రూప్ మూడు బ్యాంకులకు రూ. 3,986 కోట్లు ఎగ్గొట్టింది. రుణాలు తిరిగి చెల్లించకపోవడంపై సీబీఐ (CBI) మూడు కేసులు నమోదు చేసింది. సురానాకు అనుబంధంగా సాయిసూర్య డెవలపర్స్ పనిచేస్తోంది. 2021 ఫిబ్రవరిలో సురానా కంపెనీలో జరిగిన ఈడీ సోదాల్లో రూ. 11 కోట్ల 62 లక్షల విలువైన బంగారం, నగదు సీజ్ చేశారు. సురానా గ్రూప్ అనుబంధ సంస్థలపై పీఎంఎల్ఏ కేసు కూడా నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు దాడులు చేశారు.


రెండోసారి ఈడీ సోదాలు..

సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌‌లో ఎన్‌ఫోర్స్‌నమెంట్ డైరక్టరేట్ అధికారులు రెండోసారి సోదాలు చేశారు. సురానా ఇండస్ట్రీస్ లిమిటెడ్, M/s సురానా కార్పొరేషన్ లిమిటెడ్, M/s సురానా పవర్ లిమిటెడ్, కంపెనీల ఇద్దరు ప్రమోటర్లు, ఇతర అనుబంధ సంస్థలపై పీఎంఎల్ఏ (PMLA) కింద ఈడీ కేసు నమోదు చేసింది. దీంతో కంపెనీ ఎండి దినేష్ చంద్ సురానా, విజయ్ రాజ్ సురానా, డమ్మీ డైరెక్టర్లు ఆనంద్ ప్రభాకరన్‌లను 2022లో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా మరోసారి సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో అధికారులు సోదాలు చేశారు. మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 3,986 కోట్లు సురానా గ్రూప్ కుచ్చుటోపి పెట్టింది. తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో మొండి బకాయిలుగా కంపెనీ మారింది. బ్యాంకులకు రుణాలు చెల్లించకపోవడంపై బెంగళూర్ సీబీఐ మూడు కేసులు నమోదు చేసింది.

గతంలో సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన రూ.113.32 కోట్ల విలువైన స్థిరచరాస్తులను తాత్కాలికంగా ఈడీ అధికారులు జప్తు చేశారు. తమ బంధువులు, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉద్యోగులను డైరెక్టర్లుగా నియమించి దినేష్ చంద్ సురానా బ్యాంకులను మోసం చేశారు. బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నారు. సురానా గ్రూప్ కేమన్ ఐలాండ్‌తో పాటు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్‌లలో డమ్మీ డైరెక్టర్లను నియామకం చేసి.. ఆయా కంపెనీల్లోకి బ్యాంకు రుణాలను సురానా మళ్లించారు. సింగపూర్‌లో నాలుగు కంపెనీలు స్థాపించి వస్తువుల ఎగుమతి చేసి ఆ డబ్బును సురానా భారతదేశంలో అందుకున్నారు. దారి మళ్లించిన నిధులలో కొంత భాగాన్ని వివిధ బినామీ, కంపెనీల పేర్లలో చరాస్తులు, స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించినట్టు ఈడీ అధికారులు నిర్ధారించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కుమార్తె అలా చేయడం వల్లే.. హత్యకు గురైన మాజీ డీజీపీ..

డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలి

For More AP News and Telugu News

Updated Date - Apr 22 , 2025 | 08:17 AM