Congress vs BRS: కేటీఆర్, హరీష్రావులకు మంత్రి పొన్నం సవాల్..
ABN , Publish Date - Jun 03 , 2025 | 01:57 PM
Congress vs BRS: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్రావులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు. వారు చెప్పిన టైమ్కు చర్చకు ఎక్కడికైనా వస్తానని దీనికి వారం రోజుల సమయం ఇస్తున్నానని.. ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు వారు రావాలని మంత్రి అన్నారు.

Hyderabad: తెలంగాణ (Telangana) ఖ్యాతి ఖండాంతరాలు దాటుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఏర్పడిన మొదటి నెల నుంచే విపక్షాలు పిల్లి శాపనార్థాలు పెడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) మండిపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అంతర్జాతీయ అతిథులు రాష్ట్రానికి వస్తే విమర్శలు చేయడం తగదని అన్నారు. బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) కేటీఆర్ (KTR), హరీష్రావు (Harish Rao)లకు సవాల్ చేస్తున్నా.. దీనిపై చర్చకు ఎక్కడకు రావాలి.. తెలంగాణ భవన్కు రావాలా? అబిడ్స్ చౌరస్తాకు రావాలో చెప్పాలన్నారు. రూ. 200 కోట్లు ఖర్చు ఎక్కడ అయ్యాయో చెప్పాలని.. ఖర్చు అయినట్లు నిరూపించాలని.. లేదంటే ముక్కు నెలకు రాయాలని మంత్రి సవాల్ చేశారు.
వారం రోజులు టైమ్ ఇస్తున్నా...
కేటీఆర్, హరీష్రావు చెప్పిన టైమ్కు చర్చకు ఎక్కడికైనా వస్తానని దీనికి వారం రోజులు సమయం ఇస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు వారు రావాలని మరోసారి ఆయన సవాల్ చేశారు.
తెలంగాణ టూరిజం ప్రపంచానికి పరిచయం..
మంత్రి జూపల్లి కృష్ణారావు సెక్రటేరియట్ మీడియా పాయింట్ మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ పోటీలు విజయవంతం అయ్యాయని, ఇందుకు తోడ్పాటు అందించిన అందరికి మంత్రి కృతజ్ఞతలు చెప్పారు. మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణ టూరిజంను ప్రపంచానికి పరిచయం చేశామని, అంతర్జాతీయ పోటీలను చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం చేయగలదని నిరూపించామన్నారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో ఒలంపిక్స్ జరపగలమని నిరూపించామన్నారు. దీనికి ప్రతిపక్షాలు అభినందించాల్సింది పోయి... విమర్శలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
రూ. 31 కోట్లు ఖర్చు..
మిస్ వరల్డ్ పోటీలకు రూ. 31 కోట్లు ఖర్చు అయిందని.. స్పాన్సర్ల ద్వారా రూ. 21 కోట్లు వచ్చాయని, మరో రూ. 12 కోట్లు కమిట్మెంట్ ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మిస్ వరల్డ్ పోటీల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అయిన ఖర్చు రూ. 10 కోట్లు మాత్రమేనని చెప్పారు. విపక్షాల విమర్శలను చూసి నవ్వాలో.. ఏడ్వాలో.. తెలియడం లేదన్నారు. ఒక్కో మిస్ వరల్డ్ కంటెస్టెంట్కు 30 తులాలు కాదు కదా.. మూడు గ్రాములు కూడా ఇవ్వలేదని చెప్పారు. హరీష్ రావు చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని... ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు అబద్ధం చెప్పలేదని అన్నారు. విపక్షాలు ఏం మాట్లాడుతారో చూద్దామని ఇన్ని రోజులు వేచి చూశామన్నారు. చౌమల్లా ప్యాలెస్లో విందు ప్లేట్కు 1 లక్ష రూపాయల ఖర్చు అనేది అవాస్తవమన్నారు. ఒక్కో ప్లేట్కు 8,200 రూపాయలు మాత్రమే ఖర్చు అయిందని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భూ భారతి సర్వేను ప్రారంభించిన మంత్రులు
2కె రన్లో పాల్గొన్న ‘భైరవం’ చిత్రం యూనిట్
For More AP News and Telugu News