Telangana State Formation Day: హైదరాబాద్ చేరుకున్న జపాన్ ప్రతినిధుల బృందం.. ఎందుకంటే..
ABN , Publish Date - Jun 01 , 2025 | 04:05 PM
ఇటీవల విదేశీ పర్యటన సందర్భంగా జపాన్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా కితాక్యుషూ సిటీని సందర్శించారు. కితాక్యుషూ సిటీని చూసి ముఖ్యమంత్రి మంత్రముగ్ధులు అయ్యారు.

హైదరాబాద్: జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, నాంపల్లి గన్ పార్క్ను సిద్ధం చేస్తోంది. ఈ వేడుకల్లో మిస్ వరల్డ్ 2025 విజేత థాయ్ లాండ్ భామ ఓపల్ సుచాతా సహా పలువురు ముఖ్య అతిథిలుగా పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలోనే జపాన్లోని కితాక్యూషూ నగర మేయర్ కజుహిసా టకేచీ ప్రతినిధి బృందం హైదరాబాద్ నగరానికి చేరుకుంది.
రేపు(సోమవారం) పరేడ్ గ్రౌండ్స్లో జరిగే తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు ఈ బృంద సభ్యులు హాజరుకానున్నారు. అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్లో తెలంగాణ ప్రభుత్వం, కితాక్యుషూ పరస్పర సహకార ఒప్పందం చేసుకోనున్నారు. ఇటీవల విదేశీ పర్యటన సందర్భంగా జపాన్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా కితాక్యుషూ సిటీని సందర్శించారు. కితాక్యుషూ సిటీని చూసి ముఖ్యమంత్రి మంత్రముగ్ధులు అయ్యారు. వీధులు సహా అన్ని ప్రాంతాలనూ శుభ్రంగా ఉంచుతూ పౌరులకు మంచి సేవలు అందించడం రేవంత్ రెడ్డిని ఎంతో ఆకట్టుకుంది.
ఈ మేరకు తెలంగాణ అవతరణ వేడుకలకు రావాలని కితాక్యుషూ మేయర్ కజుహిసా టకేచీను ఆయన ఆహ్వానించారు. ఒకప్పుడు జపాన్లో అత్యంత కాలుష్యంతో ఉన్న సిటీ కితాక్యూషూ ఉండేది. గాలి, నీరు, నేల మెుత్తం విషపూరితంగా ఉండేవి. ఇప్పుడు ఈ నగరం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఉత్తమ ఉదాహరణగా నిలిచింది. దీంతో అదే విధానాలను ఇక్కడ అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ యోచిస్తోంది. ఈ మేరకు వారిని ఆహ్వానించి ఒప్పందం చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Fraudster Arrest: బాబోయ్.. వీడు మామూలోడు కాదు.. ఏకంగా 350 మందికి కుచ్చుటోపీ..
BRS VS Congress: జనగామ జిల్లాలో హైటెన్షన్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ