Share News

Metro Trains: మండే ఎండ.. మెట్రో అండ

ABN , Publish Date - Apr 26 , 2025 | 10:01 AM

ప్రస్తుతం వేసవికాలం వచ్చేసింది. సొంత వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలామంది మైట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఎక్కువశాతం మంది మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తుండడంతో ఓపక్క రద్దీ ఏర్పడుతుండగా ఆదాయం కూడా సమకూరుతోంది.

Metro Trains: మండే ఎండ.. మెట్రో అండ

- చల్లటి ప్రయాణం అందిస్తున్న రైళ్లు

- అధిక సంఖ్యలో ఆశ్రయిస్తున్న నగరవాసులు

- మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10.30 వరకు విపరీతమైన రద్దీ

- 5 లక్షలకు దగ్గరగా ప్రయాణికులు

హైదరాబాద్‌ సిటీ: ఎండల నేపథ్యంలో మెట్రోరైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రతీ బోగీలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రోడ్లపై ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చాలామంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఏసీ సౌకర్యం అంతగా లేకపోవడంతో మెట్రోలో చల్లటి ప్రయాణానికి నగరవాసులు ప్రాధాన్యమిస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఓదేల-2లో అభ్యంతరకర దృశ్యాలు తొలగించాలి


5 లక్షలకు చేరువలో..

రూ.50 వరకు టికెట్‌ చార్జీతో ఏసీలో రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉండడంతో చాలామంది మెట్రో ప్రయాణానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10.30 వరకు ఎల్‌బీనగర్‌ - మియాపూర్‌(LB Nagar - Miyapur), నాగోలు - రాయదుర్గం కారిడార్లలో ప్రయాణికుల తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది. జేబీఎస్‌ - ఎంజీబీఎస్‌ కారిడార్‌లో కూడా సాధారణ రోజుల్లో కంటే రెండింతల మంది అధికంగా ప్రయాణిస్తున్నట్లు మెట్రో వర్గాలు చెబుతున్నాయి. నాలుగు రోజులుగా 5 లక్షల మంది మార్కు దగ్గరగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని, మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఉంటోందని మెట్రో సిబ్బంది చెబుతున్నారు.

city5.jpg


నాలుగు రోజులుగా మెట్రోలో

ప్రయాణికుల సంఖ్య (లక్షల్లో)

తేదీ సంఖ్య

ఏప్రిల్‌-22 4.75

ఏప్రిల్‌-23 4.84

ఏప్రిల్‌-24 4.90

ఏప్రిల్‌-25 4.92


ఈ వార్తలు కూడా చదవండి

ఆన్‌లైన్‌లో అవకాడోలు బుక్‌ చేస్తే.. రూ.2.60 లక్షలు స్వాహా

మీ వీడియో నా దగ్గరుంది.. రూ.5 కోట్లు ఇవ్వండి..

బూడిద గుమ్మడితో భలే భలేగా

రజతోత్సవ వేళ రగిలే ప్రశ్నలు

యువతితో షాకింగ్ డాన్స్..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 26 , 2025 | 10:01 AM