Home » Metro News
మెట్రో రైలు స్వాధీనానికి సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో స్వాధీన తీర్మానం ప్రవేశపెట్టారు. మెట్రో స్వాధీన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
గ్రేటర్లో మెట్రో డీలక్స్ బస్సుల సంఖ్య పెంచే దిశగా ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దానిలో భాగంగా చార్జీల్లో 15-20 శాతం రాయితీ కల్పిస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన ఇవాళ(సోమవారం) క్యాబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చిస్తున్నారు. హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
మెట్రో రెండో దశ డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)పై ప్రతిష్టంభన నెలకొంది. తమ వద్దకు సరైన డీపీఆర్ ఇప్పటివరకు రాలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా.. తాము ఏడాది క్రితమే అన్ని అంశాలతో సమగ్రంగా పంపించామని, కేంద్రం అడుగుతున్న వివరాలను తెలియజేస్తున్నామని హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈస్ట్ ఢిల్లీలోని మయూర్ విహార్ పాకెట్ 1 మెట్రో స్టేషన్ పేరు మార్చారు. 'శ్రీరామ్ మందిర్ మయూర్ విహార్'గా పేరు పెట్టారు. మెట్రో స్టేషన్ పేరు మార్చినట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రింగ్రైల్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా అసెంబ్లీలో మంత్రి శ్రీధర్బాబు చేసిన ప్రకటనతో ఔటర్ చుట్టూ మెట్రోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
సాధారణంగా రైళ్లలో కొంత మంది ప్రయాణికులు చేసే వింత చేష్టలకు ఆశ్చర్యంతో పాటు నవ్వొస్తుంది. ఒక వ్లాగర్ ట్రైన్లో విచిత్రంగా ప్రవర్తించడం చూసి పక్క ప్రయాణికులు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
కొత్త ఏడాదిని పురస్కరించుకుని బుధవారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు నడుపుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు తెలిపిరు. ప్రతిరోజూ రాత్రి 11 గంటల వరకు నడిచే రైళ్లు... నూతన సంవత్సరాన్ని పురష్కరించుకుని సమయాభావాన్ని పెంచినట్లు తెలిపారు.
హైదరాబాద్ మెట్రో రైల్.. ఇక కార్పొరేషన్గా విస్తరించే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని ఇటీవల విస్తరించారు. 150 ఉన్న వార్డులను 300లకు విస్తరించారు. దీంతో మెట్రో రైలును కూడా విస్తరించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
హైదరాబాద్ మెట్రో రైల్.. శుక్రవారం నాటికి ఏడేళ్లు పూర్తి చేసుకుని ఎనిమిదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. 57 మెట్రోస్టేషన్లతో.. ప్రతిరోజూ 4.60 లక్షల నుంచి 4.80 లక్షల మంది ఈ రైళ్లల్లో ప్రయాణస్తున్నారు. అయితే... పెరిగిన అవసరాల నేపధ్యంలో ఈ మెట్రో రైళ్ల సేలలను ఇంకా విస్తరింపజేయాల్సిన అంసరం ఉంది.