Hyderabad: అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి
ABN , Publish Date - May 21 , 2025 | 08:52 AM
నగరంలోని గుల్జార్హౌజ్లో జరిగిన అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17మంది చనిపోవడం బాధాకరమన్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలన్నారు.

- ఎంపీలు ఈటల, కొండా
హైదరాబాద్: చార్మినార్ గుల్జార్హౌజ్లో జరిగిన అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి(BJP MPs Etala Rajender, Konda Vishweshwar Reddy) ప్రభుత్వాన్ని కోరారు. చార్మినార్ అగ్నిప్రమాద మృతుల సంతాపసభ మంగళవారం శివరాంపల్లిలోని ఎస్ఎన్సీ కన్వెన్షన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ రాజేందర్నగర్ ఇన్చార్జి తోకల శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు.
ఈ వార్తను కూడా చదవండి: Secundrabad: రైళ్లలో ప్రయాణికులను బెదిరించి డబ్బులు వసూలు..
ఈ సందర్భంగా ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17మంది చనిపోవడం బాధాకరమన్నారు. షార్ట్సర్క్యూట్ ఎలా జరిగింది.. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఎంత సమయంలో అక్కడికి వచ్చారు, ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారనే అంశాలపై పూర్తిస్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలన్నారు.
బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అన్ని విధాలుగా బీజేపీ(BJP) అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) మాట్లాడుతూ.. మహా నగరంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
నల్లమల సంపదపై రేవంత్ కన్ను: బీఆర్ఎస్
BSF Jawan: దేశసేవకు వెళ్లి.. విగతజీవిగా ఇంటికి..
Adilabad MP Nagesh: పటాన్చెరు- ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణ పనులు చేపట్టాలి
Read Latest Telangana News and National News