Share News

BJP: హైడ్రా అధికారుల తీరుతో ఇళ్లలోకి నీళ్లు..

ABN , Publish Date - May 14 , 2025 | 10:08 AM

హైడ్రా అధికారుల తీరుతో ఇళ్లలోకి నీళ్లొస్తున్నాయని, దీంతో కాలనీలో ప్రజలు ఉండలేని స్థితి వచ్చిందని భారతీయ జనతా పార్టీ నాయకుడు వడ్డెపల్లి రాజేశ్వర్‌రావు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ... హైడ్రా అధికారుల తీరుతో ఎన్నో కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయన్నారు.

BJP: హైడ్రా అధికారుల తీరుతో ఇళ్లలోకి నీళ్లు..

- బీజేపీ నేత రాజేశ్వర్‌రావు

హైదరాబాద్: నల్లచెరువు సుందరీకరణ పేరుతో మందస్తు ప్రణాళిక లేకుండా చేస్తున్న పనులతోనే వరదనీరు ఇళ్లలోకి చేరుకుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డెపల్లి రాజేశ్వర్‌రావు(Vaddepalli Rajeshwar Rao) అన్నారు. కూకట్‌పల్లి ఇన్‌చార్జ్‌ మాధవరం కాంతారావుతో కలిసి నల్లచెరువుకు అనుకుని ఉన్న కాలనీల్లో పర్యటించారు. అకాల వర్షంతో ఇళ్లలోకి నీరు చేరుకుందని కాలనీవాసులు తమ గొడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైడ్రా అధికారుల తీరుతోనే ఇళ్లలోకి నీరు చేరుతుందన్నారు. చెరువులో మట్టి పోయడంతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. వెంటనే జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యరావు, శ్రీకర్‌రావు, నాగరాజు, శంకర్‌రెడ్డి విశాల్‌సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Special buses: పుష్కరాలకు ప్రత్యేక బస్సులు.. ఎక్కడెక్కడి నుంచంటే..


city6.jpg

ఎంపీ ఈటలను విమర్శిస్తే ఊరుకోం..

నిరంతరం ప్రజల సమస్యలపై గళమెత్తుతున్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌(BJP MP Etala Rajender)పై కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని కూకట్‌పల్లి బీజేపీ ఇన్‌చార్జ్‌ మాధవరం కాంతరావు, బీజేపీ కార్యవర సభ్యులు వడ్డెపల్లి రాజేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం కూకట్‌పల్లి బీజేపీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. ఎంపీ ఈటలపై ఎవరు విమర్శలు చేసినా ఉరుకునేది లేదన్నారు. ఈటల గురించి మాట్లాడే అర్హత జగ్గారెడ్డికి లేదన్నారు. బాచుపల్లిలోని మేడికుంట ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మించిన అపార్టుమెంట్‌లో 80 కుటుంబాలను ఖాళీ చేయమని తహిసీల్దార్‌ ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన ఎంపీ ప్రశ్నిస్తున్నారని, అలాంటి వారిపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ముగిసిన యుద్ధం మిగిల్చిన ప్రశ్నలు

కృష్ణా జలాల పునఃపంపిణీ తెలంగాణ జన్మహక్కు

ఛీ.. నువ్వు భర్తవేనా.. మద్యం కోసం ఫ్రెండ్స్ వద్దకి భార్యని పంపుతావా?

నీలి చిత్రాల్లో నటిస్తే లక్షలు ఇస్తామని.. వివాహితను హోటల్‌కు పిలిపించి..!

దారుణం.. పురుషాంగం కోసుకుని ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య!

Read Latest Telangana News and National News

Updated Date - May 14 , 2025 | 10:08 AM