Andole: సత్తా చాటారు.. అందోల్ విద్యార్థులు..
ABN , Publish Date - Apr 30 , 2025 | 10:35 PM
తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. సంగారెడ్డి జిల్లా అందోల్కి చెందిన ముగ్గురు విద్యార్థులు అత్యధిక మార్కులు తెచ్చుకున్నారు.

అందోల్: తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. సంగారెడ్డి జిల్లా అందోల్కి చెందిన ముగ్గురు విద్యార్థులు అత్యధిక మార్కులు తెచ్చుకున్నారు. అందోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులందరూ 100% ఉత్తీర్ణత సాధించడంతో పాఠశాలలో సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థుల్లో మునాజ్జా బేగం 583 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా, ఎన్. అఖిల 560 మార్కులతో ద్వితీయ, పి. సాయిచరణ్ 557 మార్కులతో తృతీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. దేవిదాస్ మాట్లాడుతూ.. విద్యార్థుల అంకితభావం, ఉపాధ్యాయుల, నిరంతర కృషి ఫలితంగానే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారికి సహకరించిన ఉపాధ్యాయ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం పాఠశాల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. అందోల్ జెడ్పీబీహెచ్ఎస్ నుంచి మొత్తం 75 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా అందరూ ఉత్తీర్ణత సాధించడం విశేషం. అంతేకాకుండా ఒక విద్యార్థిని అత్యధికంగా A1 గ్రేడ్ సాధించారు. ఈ విజయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు.
Also Read:
BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ
Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..
Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..