Share News

Kohli-Ashwin: కోహ్లీ-అశ్విన్ కెరీర్.. కవలల కంటే ఎక్కువ పోలికలు..

ABN , Publish Date - May 13 , 2025 | 02:22 PM

Team India: ఒక్క సిరీస్‌ వైఫల్యం ఏకంగా ముగ్గురు సీనియర్లు రిటైర్‌మెంట్ తీసుకునేలా చేసింది. ఒకరి తర్వాత ఒగరుగా టీమిండియా స్టార్లు టెస్టుల నుంచి వైదొలుగుతున్నారు. ఇదే క్రమంలో టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.

Kohli-Ashwin: కోహ్లీ-అశ్విన్ కెరీర్.. కవలల కంటే ఎక్కువ పోలికలు..
Virat Kohli

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించి అందర్నీ విస్మయానికి గురిచేశాడు. ఫామ్, ఫిట్‌నెస్ ఉన్నా ఇంకా వయసు సమస్య లేకపోయినా.. ఇంకొన్నేళ్లు ఆడే సత్తా ఉన్నప్పటికీ అనూహ్యంగా సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు కింగ్. దీంతో ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు. అయితే తమ అభిమాన ఆటగాడ్ని ఇక వైట్ జెర్సీలో చూడలేమనే విషయం బాధపెడుతున్నా.. హ్యాపీ రిటైర్‌మెంట్ అంటూ కోహ్లీ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నారు. ఇదే తరుణంలో టెస్టుల్లో అతడు అందించిన సేవల్ని, ఆడిన చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లను గుర్తుచేసుకుంటున్నారు. ఈ సమయంలో కోహ్లీకి సంబంధించిన ఓ విషయం వైరల్‌గా మారింది. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో విరాట్ కెరీర్‌కు ఉన్న పోలికల గురించి చర్చించుకుంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..


ఇన్ని పోలికలా..

కోహ్లీ-అశ్విన్ టెస్ట్ కెరీర్ ఒకేసారి ప్రారంభమైంది. జూన్ 20, 2011లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో విరాట్ డెబ్యూ ఇచ్చాడు. అదే ఏడాది నవంబర్ 11న కరీబియన్ టీమ్‌తోనే జరిగిన మరో టెస్ట్ సిరీస్‌లో అశ్విన్ అరంగేట్రం చేశాడు. అప్పటినుంచి 14 ఏళ్ల పాటు టీమిండియాకు కలసి ఆడారీ స్టార్లు. ఎన్నో కీలక మ్యాచుల్లో ఒంటిచేత్తో జట్టును గెలిపించారు. ఓడిపోయే పోరుల్లో అద్భుతమైన ఆటతీరుతో టీమ్‌ను గట్టెక్కించారు. ఒకప్పుడు యువకులుగా ఎంట్రీ ఇచ్చిన ఇద్దరూ.. దశాబ్దంన్నర అయ్యేసరికి దిగ్గజాలుగా రిటైర్ అయ్యారు. ఇద్దరూ ఒకే సిరీస్‌తో కెరీర్‌కు వీడ్కోలు పలికారు. బీజీటీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కలసి ఆడారు కోహ్లీ-అశ్విన్. అదే ఇద్దరికీ చివరి సిరీస్.


ఒకేసారి పీక్‌కు..

కోహ్లీ-అశ్విన్‌కు మరో విషయంలోనూ సారూపత్య ఉంది. వీళ్లిద్దరూ 2016-17 సీజన్‌లో టెస్టుల్లో చెలరేగి ఆడారు. ఆ సీజన్‌లో అశ్విన్ 31 మ్యాచుల్లో 97 వికెట్లు తీయడమే గాక 659 పరుగులు బాదాడు. ఆ ఏడాది కోహ్లీ 75 స్ట్రైక్‌ రేట్‌తో 1215 పరుగులు చేశాడు. ఇలా వీళ్లిద్దరి కెరీర్‌లో చాలా విషయాల్లో సేమ్ టు సేమ్ ఉండటంతో కవల పిల్లలతో పోలుస్తున్నారు నెటిజన్స్. ఒకేసారి వచ్చారు, ఒకేసారి కెరీర్‌లో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు, ఒకేసారి జట్టును విడిచి వెళ్లిపోయారి కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

కెప్టెన్సీతో కెరీర్‌ను ముగించిన కోహ్లీ

గంభీర్ వల్లే కోహ్లీ రిటైర్‌మెంట్

ఐపీఎల్‌పై ఆసీస్ బోర్డు ట్విస్ట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 13 , 2025 | 02:22 PM