Shahid Afridi: పాక్ క్రికెటర్ అఫ్రిదీకి గట్టి షాక్.. ఇండియాతో పెట్టుకుంటే ఇట్లుంటది
ABN , Publish Date - Apr 30 , 2025 | 07:56 PM
IND vs PAK: పాకిస్థాన్ క్రికెటర్లకు భారత ప్రభుత్వం షాకుల మీద షాకులు ఇస్తోంది. మొన్న షోయబ్ అక్తర్కు షాక్ ఇచ్చిన మోదీ సర్కారు.. ఇవాళ షాహిదీ అఫ్రిదీకి దిమ్మతిరిగేలా చేసింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. పాకిస్థాన్తో అన్ని రకాల సంబంధాలను కట్ చేసేసిన మోదీ సర్కారు.. మొన్ననే ఆ దేశానికి చెందిన 16 యూట్యూబ్ చానల్స్ను బ్యాన్ చేసింది. ఇవి ఇండియాకు వ్యతిరేకంగా, రెచ్చగొట్టే విధంగా ఉన్న వీడియోలు, మతపరమైన కంటెంట్ను ప్రసారం చేస్తున్నాయని సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించింది. బ్యాన్ చేసిన వాటిలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చానల్ కూడా ఉంది. ఈ షాక్ నుంచి పాక్ క్రికెట్ తేరుకునే లోపే మరోమారు దిమ్మతిరిగేలా చేసింది భారత్. ఈసారి షాహిద్ అఫ్రిదీ యూట్యూబ్ అకౌంట్ మీద నిషేధం విధించింది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం..
రీజన్ ఇదే..
పహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో రీసెంట్గా భారత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని కించపరిచేలా వ్యాఖ్యానించాడు అఫ్రిదీ. ఈ దాడిని ఇండియన్ ఆర్మీ ఎందుకు అడ్డుకోలేకపోయింది అంటూ తన అక్కసును అతడు వెళ్లగక్కాడు. దీంతో దుమారం రేగింది. మా ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా.. నీకెంత దమ్మంటూ అఫ్రిదీపై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా అఫ్రిదీ యూట్యూబ్ అకౌంటర్ను బ్యాన్ చేసింది. ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తొయిబా (ఎల్ఈటీ)కు అనుకూలంగా అఫ్రిదీ చానల్ భారత్లో కథనాలను ప్రసారం చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని తెలుస్తోంది. దీనికి తోడు ఇండియన్ ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం నిషేధానికి కారణాలని సమాచారం. ఈ నేపథ్యంలో ఇంకా ఎన్ని పాక్ యూట్యూబ్ చానళ్లు బ్యాన్కు గురవుతాయో చూడాలి.
ఇవీ చదవండి:
ధోనీ రిటైర్ అవ్వాల్సిందే: గిల్క్రిస్ట్
కోహ్లీపై విమర్శలు.. కౌంటర్ ఇచ్చిపడేశాడుగా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి