RCB Victory Parade: బెంగళూరు విషాదంపై సచిన్-కమల్ రియాక్షన్.. ఏమన్నారంటే..!
ABN , Publish Date - Jun 05 , 2025 | 10:21 AM
ఆర్సీబీ విక్టరీ పరేడ్ సమయంలో చోటుచేసుకున్న విషాదంపై సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు. ఈ ఘటనపై స్టార్ హీరో కమల్ హాసన్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రియాక్ట్ అయ్యారు. ఇంతకీ వాళ్లు ఏమన్నారంటే..

18 ఏళ్ల ఎదురుచూపులకు ఆర్సీబీ తెరదించింది. తొలి కప్పు కలను 18వ సీజన్లో నిజం చేసుకుంది. ప్రతిష్టాత్మక ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను మట్టికరిపించి ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో ఇన్నేళ్లుగా గెలుపోటములకు అతీతంగా తమకు మద్దుతగా ఉంటూ వస్తున్న అభిమానుల కోసం బెంగళూరులో విక్టరీ పరేడ్ నిర్వహించింది ఆర్సీబీ. దీంతో కప్పుతో వస్తున్న కోహ్లీ సేనను స్వాగతించేందుకు లక్షలాది మంది గుమిగూడారు. అభిమాన క్రికెటర్లతో కలసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నారు. కానీ ఇది విషాదాన్ని మిగిల్చింది. చిన్నస్వామి స్టేడియంలోకి ఒక్కసారిగా భారీగా ఫ్యాన్స్ దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. చాలా మంది అభిమానులు గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, విశ్వనటుడు కమల్ హాసన్ స్పందించారు. గుండె పగిలిందంటూ ఇద్దరూ ఎమోషనల్ అయిపోయారు.
మాటలు రావట్లేదు..
బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు కమల్ హాసన్. హృదయ విదారకంగా అనిపించిందని, తీవ్రమైన బాధలో ఉన్నానని నెట్టింట పెట్టిన పోస్ట్లో ఆయన రాసుకొచ్చారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కమల్. గాయాలతో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పోస్ట్ చేశారు. అటు సచిన్ కూడా బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశాడు. మృతుల కుటుంబాలకు శాంతి, బలాన్ని చేకూర్చాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు సచిన్ తన పోస్ట్లో రాసుకొచ్చాడు. ఈ ఘటనపై ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. మాటలు రావట్లేదని, తీవ్రంగా కుంగిపోయానని జట్టు అధికారిక ప్రకటనను కింగ్ రీపోస్ట్ చేశాడు. కాగా, కమల్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా ఇవాళే బిగ్స్క్రీన్స్లోకి వచ్చింది. అయితే కన్నడ భాష మీద కమల్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో కర్ణాటకలో ఈ చిత్నాన్ని విడుదల చేయలేదు. ఈ మూవీని కన్నడ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ బ్యాన్ చేసింది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి