RR vs MI Toss: టాస్ ఓడిన ముంబై.. అయినా వాయించి వదలడం ఖాయం
ABN , Publish Date - May 01 , 2025 | 07:07 PM
Today IPL Match: రాజస్థాన్ రాయల్స్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ షురూ అయింది. టాస్ నెగ్గిన రాజస్థాన్ సారథి రియాన్ పరాగ్ ఏం ఎంచుకున్నాడో ఇప్పుడు చూద్దాం..

ప్లేఆఫ్స్కు సమయం దగ్గర పడుతున్న తరుణంలో రాజస్థాన్ రాయల్స్-ముంబై ఇండియన్స్ మధ్య కీలక పోరాటం మొదలైంది. ప్లేఆఫ్స్ క్వాలిఫికేషన్ కోసం తహతహలాడుతున్న ముంబై.. పరాగ్ సేనను ఓడించాలని చూస్తోంది. మరో గెలుపుతో ప్లేఆఫ్స్ దిశగా భారీ ముందడుగు వేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా మ్యాచ్లో ముంబై టాస్ ఓడిపోయింది. టాస్ నెగ్గిన ప్రత్యర్థి జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఎంఐ ఫస్ట్ బ్యాటింగ్కు దిగనుంది. ఆల్రెడీ ఊపు మీదున్న ఆ టీమ్ బ్యాటర్లు గానీ చెలరేగితే రాజస్థాన్కు దబిడిదిబిడే అని చెప్పాలి. రోహిత్ అండ్ కో అపోజిషన్ బౌలర్లను వాయించి వదలడం ఖాయంగా కనిపిస్తోంది.
గెలవాల్సిందే..
ఈ మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఎలెవన్లో పలు మార్పులు చేసింది రాజస్థాన్. కార్తికేయ, ఆకాశ్ మధ్వాల్, ఫజల్హక్ ఫారూకీని తుదిజట్టులోకి తీసుకుంది. రాజస్థాన్ తరఫున మధ్వాల్కు ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. అటు ముంబై ఇండియన్స్ గత మ్యాచ్లో ఆడిన టీమ్నే మళ్లీ రిపీట్ చేసింది. రోహిత్ నుంచి బుమ్రా వరకు సేమ్ టీమ్ను కంటిన్యూ చేస్తోంది ఎంఐ మేనేజ్మెంట్. కాగా, ఈ మ్యాచ్లో నెగ్గితే ప్లేఆఫ్స్ క్వాలిఫికేషన్ దిశగా ముంబై మరో బిగ్ స్టెప్ ముందుకు వేస్తుంది. అటు రాజస్థాన్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇవాళ ఎలాగైనా నెగ్గితీరాలి. ప్లేఆఫ్స్ లెక్కలు మ్యాచ్ మ్యాచ్కూ మారిపోతున్నందున గెలవకపోతే ఇరు జట్లకూ ఇబ్బందులు తప్పవు. ముంబై ఓడినా అంతగా ప్రాబ్లమ్ లేదు. కానీ పరాగ్ సేన మాత్రం ఈ మ్యాచ్తో ఆడే ఇతర మ్యాచుల్లోనూ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితుల్లో ఉంది.
ఇవీ చదవండి:
ధోనీని సీఎస్కే ఓనర్ ఎందుకు ఆపినట్లు..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి..