RCB IPL 2025: చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. తొలి ఐపీఎల్ జట్టుగా రికార్డు!
ABN , Publish Date - May 26 , 2025 | 03:00 PM
ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును బెంగళూరు అందుకుంది. మరి.. ఏంటా ఘనత అనేది ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్-2025లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. 13 మ్యాచుల్లో 17 పాయింట్లతో ప్లేఆఫ్స్కు అధికారికంగా అర్హత సాధించింది. ఆఖరి లీగ్ మ్యాచ్లోనే నెగ్గితే టాప్-2లో ఫినిష్ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే క్వాలిఫయర్-1లో పోటీపడుతుంది ఆర్సీబీ. ఈసారి కప్పు కొట్టాలని కసిగా ఉన్న కోహ్లీ టీమ్.. ముందు ఫైనల్ చేరడం మీద దృష్టి పెడుతోంది. ఈ తరుణంలో ఆ జట్టు అభిమానులకు మరో శుభవార్త. ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. క్యాష్ రిచ్ లీగ్ హిస్టరీలో ఇన్నేళ్లలో ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన ఘనతను అందుకుంది. మరి.. బెంగళూరు సాధించిన ఆ రికార్డు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం..
సాటిలేని రికార్డు!
క్రికెట్ గ్రౌండ్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ ఆర్సీబీకి భారీ అభిమాన గణం ఉన్నారు. బెంగళూరు ఫ్రాంచైజీకి సంబంధించిన ప్రతి అంశాన్ని నెట్టింట ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు. ఇన్స్టాలో ఆర్సీబీకి సంబంధించిన అప్డేట్స్ను తెలుసుకుంటూ ఉంటారు. అలాంటి చోట ఏకంగా 20 మిలియన్ ఫాలోవర్లను సంపాదించింది బెంగళూరు. ఇన్స్టాగ్రామ్లో ఇరవై మిలియన్ ఫాలోవర్లను పూర్తి చేసుకున్న తొలి ఐపీఎల్ జట్టుగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఏ టీమ్ కూడా దీనికి దగ్గరగా రాలేదు. ఐపీఎల్-2025 మొదలవడానికి ముందు 18 మిలియన్ల ఫాలోవర్లతో ఉంది ఆర్సీబీ. కానీ ఈ నెలన్నర వ్యవధిలో కొత్తగా 2 మిలియన్ల ఫాలోవర్లను దక్కించుకొని 20 మిలియన్ మార్క్ను టచ్ చేసింది. ఇన్స్టా ఫాలోవర్ల విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ (18.6 మిలియన్లు) ముంబై ఇండియన్స్ (18 మిలియన్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. దీంతో ఆర్సీబీకి తిరుగులేదని, తమ జట్టుకు ఉన్న క్రేజ్ ఏంటో చెప్పేందుకు ఇదో ఉదాహరణ అని ఆ టీమ్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, చివరి మ్యాచ్లో మార్చి 27న లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది బెంగళూరు. ఇందులో నెగ్గితే టాప్-2తో లీగ్ దశను ముగించొచ్చు.
ఇవీ చదవండి:
ఇండియా మ్యాచులు.. ఫ్రీగా చూసేయండిలా..
ఆఖరాటలో అదరగొట్టినా అట్టడుగునే
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి