Ban On RCB: ఆర్సీబీపై వేలాడుతున్న నిషేధం కత్తి.. తప్పించుకోవడానికి ఒకే దారి!
ABN , Publish Date - Jun 09 , 2025 | 02:28 PM
ఆర్సీబీపై బ్యాన్ తప్పదా.. ఇప్పుడు క్రికెట్ లవర్స్ జోరుగా చర్చిస్తున్న అంశమిది. ఈ పుకార్లు రోజురోజుకీ మరింత ఊపందుకుంటున్నాయి. అసలు ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..

ఏ క్షణాన ఐపీఎల్ కప్పు కల నెరవేర్చుకుందో గానీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఏదీ కలసి రావడం లేదు. 18 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న క్యాష్ రిచ్ లీగ్ ట్రోఫీని సొంతం చేసుకున్నప్పటి నుంచి ఆర్సీబీ ఫ్రాంచైజీని కష్టాలు చుట్టుముట్టాయి. అభిమానులతో కలసి సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తే అది కాస్తా ఊహించని విషాదాన్ని మిగిల్చింది. చిన్నస్వామి స్టేడియానికి భారీ సంఖ్యలో ఫ్యాన్స్ తరలి రావడంతో తొక్కిసలాట జరగడం.. అందులో 11 మంది ప్రాణాలు కోల్పోవడం అందర్నీ కలచివేసింది. ఈ ఘటనతో ఆర్సీబీపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. విన్నింగ్ పరేడ్ నిర్వహణ మీద సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ జరుగుతోంది. ఇదే తరుణంలో కోహ్లీ టీమ్పై బ్యాన్ తప్పదని.. వచ్చే సీజన్లో బెంగళూరు ఆడబోదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తప్పించుకునేనా?
ఆర్సీబీని బీసీసీఐ నిషేధించడం పక్కా అని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. బెంగళూరు తొక్కిసలాటపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడం, అభిమానులు సీరియస్ అవడంతో బీసీసీఐ జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇది ఆర్సీబీ ప్రైవేట్ కార్యక్రమం అని.. తాము గనుక ఇలాంటి కార్యక్రమం చేపడితే ముందస్తు ప్లానింగ్తో నిర్వహించే వాళ్లమంటూ ఎస్కేప్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్సీబీ మీద బీసీసీఐ సీరియస్ అవడం, తప్పు వాళ్లదేనంటూ చెప్పడంతో ఆ టీమ్ను నిషేధించడం పక్కా అనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాన్ తప్పించుకోవాలంటే ఆర్సీబీ ఏం చేయాల్సి ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
నెపంలో నిజమెంత?
విక్టరీ పరేడ్ను ఆర్సీబీ ఒక్కటే నిర్వహించలేదు. కర్ణాటక క్రికెట్ సంఘంతో పాటు స్థానిక ప్రభుత్వ యంత్రాంగంతో కలసి ఏర్పాట్లు చేసింది ఆర్సీబీ. బందోబస్తు పనులు ఆ రాష్ట్ర పోలీసు శాఖ చూసుకుంది. కాబట్టి ఆర్సీబీదే పూర్తిగా తప్పు అని చెప్పడానికి లేదని.. రాష్ట్ర క్రికెట్ బోర్డుతో పాటు సర్కారు వైఫల్యమూ ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఫ్రాంచైజీల ఒప్పందాల ప్రకారం గ్రౌండ్లో జరిగిన విషయాలతో జట్లకు సంబంధం ఉంటుంది. కానీ తొక్కిసలాట స్టేడియానికి బయట చోటుచేసుకుంది. కాబట్టి ఆర్సీబీపై నెపం వేయడానికి చాన్స్ లేదని నెటిజన్స్ చెబుతున్నారు.
పక్కా సేఫ్..!
తొక్కిసలాటపై ఆర్సీబీ త్వరగానే స్పందించింది. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్సీబీ కేర్స్ నుంచి పరిహారం ప్రకటించింది. ఆ పరిహారాన్ని తర్వాత రూ.25 లక్షలకు పెంచింది. ఇవన్నీ కూడా నిషేధం విషయంలో బీసీసీఐ వెనుకంజ వేయడానికి ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. దీనికి తోడు ఐపీఎల్లో భారీ అభిమానగణం ఉన్న జట్టు ఆర్సీబీ. ఆ జట్టు నికర విలువ 117 మిలియన్లు. అలాంటి టీమ్ను బ్యాన్ చేస్తే వ్యూయర్షిప్, యాడ్స్.. ఇలా చాలా విషయాలపై ప్రభావం పడే ప్రమాదం ఉండటం కూడా బోర్డును వెనక్కి తగ్గేలా చేస్తున్నాయని నెటిజన్స్ అంటున్నారు.
ఇవీ చదవండి:
లేడీ అంపైర్పై అశ్విన్ సీరియస్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి